Operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. ఉదయం 10. 30 గంటలకు ఆర్మీ ప్రెస్‌మీట్‌

Operation sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. ఉదయం 10. 30 గంటలకు ఆర్మీ ప్రెస్‌మీట్‌

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి భారత్‌ గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్‌ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation


Sindoor)’ విజయవంతగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను భారత ఆర్మీ (Indian Army) మరికొద్ది సేపట్లో వెల్లడించనుంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు సైన్యం,


విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించనుంది. ఇక, ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ భేటీ కానుంది. అటు కేంద్ర మంత్రివర్గం కూడా నేడు సమావేశం కానుంది. *


పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ మెరుపుదాడులు మరోవైపు, మెరుపు దాడుల నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ త్రివిధ దళాల అధిపతులతో మాట్లాడారు. ఆపరేషన్‌ వివరాలను, తాజా


పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉండగా.. మెరుపు దాడుల నేపథ్యంలో సరిహద్దుల్లో పాక్‌ (Pakistan) సైన్యం కాల్పులకు పాల్పడుతోంది. వీటిని భారత ఆర్మీ సమర్థంగా


తిప్పికొడుతోంది.