Iran: ఇరాన్‌లో కిడ్నాప్‌ అయిన భారత యువకులు క్షేమం.. ఎంబసీ పోస్ట్‌

Iran: ఇరాన్‌లో కిడ్నాప్‌ అయిన భారత యువకులు క్షేమం.. ఎంబసీ పోస్ట్‌

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇరాన్‌ (Iran)లో గత నెల అదృశ్యమైన ముగ్గురు భారత యువకుల ఆచూకీ లభించింది. దుండగుల చెరలో ఉన్న బాధిత యువకులను (Indians) టెహ్రాన్‌ పోలీసులు కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఈ


విషయాన్ని భారత్‌లోని ఇరాన్‌ ఎంబసీ ‘ఎక్స్‌’ పోస్ట్‌లో వెల్లడించింది. పంజాబ్‌కు చెందిన సంప్రీత్, అమృత్‌పాల్, జస్పాల్‌.. ఉద్యోగాల కోసం ఏజెంట్ల సాయంతో దిల్లీ మీదుగా డంకీ  ఆస్ట్రేలియాకు


బయల్దేరారు. వారిని తీసుకువెళ్లిన ఏజెంట్లు తాత్కాలికంగా బస చేద్దామని నమ్మించి ఇరాన్‌ తీసుకెళ్లారు. అక్కడ వీరు కిడ్నాప్‌నకు గురైనట్లు బాధిత యువకుల కుటుంబ సభ్యులు పంజాబ్‌లోని అధికారులను


ఆశ్రయించారు. విడుదల చేయాలంటే డబ్బు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. * పాకిస్థాన్‌ జైల్లోంచి 216 మంది ఖైదీల పరారీ దీంతో దీంతో పంజాబ్‌ ప్రభుత్వం ఈ విషయాన్ని ఇరాన్‌లోని


భారత రాయబార కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లింది. వారు సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన టెహ్రాన్‌ పోలీసులు యువకుల కోసం గాలింపు చేపట్టారు. దక్షిణ టెహ్రాన్‌లోని


వెరామిన్‌ ప్రాంతంలో బందీలుగా ఉన్న వీరిని విడిపించారు. ప్రస్తుతం ఈ కేసును ఇరాన్‌ విదేశీ వ్యవహారాల శాఖలోని కాన్సులర్ విభాగం పరిశీలిస్తోందని, సంబంధిత న్యాయ అధికారులతో చర్చలు జరుపుతోందని ఎంబసీ


పేర్కొంది. ఈ కేసు న్యాయ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు టెహ్రాన్‌లోని భారత ఎంబసీతో పంచుకుంటున్నట్లు తెలిపింది. మోసపూరిత వ్యక్తులు, అక్రమ ఏజెన్సీలు చెప్పే మాటలు నమ్మి ఉద్యోగాల


కోసం చట్టవ్యతిరేక మార్గాల్లో ఇతర దేశాలకు రావొద్దని ఎంబసీ సూచించింది.