
Operation sindoor: తప్పులను సరిదిద్దుకొని.. దీటుగా స్పందించాం - సీడీఎస్ కీలక వ్యాఖ్యలు
Play all audios:

పాకిస్థాన్తో ఇటీవల జరిగిన ఘర్షణల్లో భారత వాయుసేనకు కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. వెంటనే వాటిని అధిగమించి.. శత్రుమూకలపై తీవ్రంగా విరుచుకుపడ్డామని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్
చౌహాన్ పేర్కొన్నారు. ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్తో ఇటీవల జరిగిన ఘర్షణల్లో భారత వాయుసేనకు కొన్ని సవాళ్లు ఎదురైన మాట వాస్తవమేనని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్
అంగీకరించారు. అయినప్పటికీ వెంటనే వాటిని అధిగమించి.. శత్రుమూకలపై తీవ్రంగా విరుచుకుపడ్డామని అన్నారు. ఈ క్రమంలో కొంత నష్టం ఏర్పడిన మాట వాస్తవమేనన్నారు. అయితే, ఆరు జెట్లను కూల్చేసినట్లు పాక్
(Pakistan) చేస్తున్న వాదన మాత్రం పూర్తిగా తప్పు అని సీడీఎస్ స్పష్టం చేశారు. సింగపూర్లో జరుగుతున్న షాంగ్రీ-లా డైలాగ్లో సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అంతర్జాతీయ
మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘యుద్ధవిమానం కూలిపోవడమనేది ముఖ్య విషయం కాదని అనుకుంటున్నా. అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడమే ముఖ్యం. మావైపు జరిగిన వ్యూహాత్మక
తప్పిదాలను వెంటనే గుర్తించాం. వాటిని సరిదిద్దుకొని రెండు రోజుల్లోనే మళ్లీ దాన్ని విజయవంతంగా అమలుచేశాం. సుదీర్ఘ లక్ష్యాలను పెట్టుకొని ఆ దిశగా యుద్ధ విమానాలను మోహరించాం’’ అని సీడీసీ జనరల్
అనిల్ చౌహాన్ వెల్లడించారు. * ఆ ఫొటో చూసి చలించిపోయా: అనుపమ్ ఖేర్ ఇదే విషయంపై భారత వాయుసేనలో డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతీ గతంలోనే స్పందించారు. నష్టం జరగడమనేది పోరాటంలో
భాగమేనన్నారు. అయితే, వాయుసేన పైలట్లందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని చెప్పారు. తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ సిందూర్పై సాయుధ దళాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
ఎయిర్ మార్షల్ ఈ విధంగా స్పందించిన సంగతి తెలిసిందే.