
Pm modi: ‘ఈ గొప్ప అవకాశం నాకే దక్కింది’.. తన నివాసంలో ‘సిందూర’ మొక్క నాటిన ప్రధాని
Play all audios:

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) దిల్లీలోని తన అధికార నివాస ప్రాంగణంలో ‘సిందూర’ (sindoor) మొక్కను నాటారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్థాన్తో భారత్ చేసిన యుద్ధంలో
ధైర్యసాహసాలు ప్రదర్శించిన మహిళా బృందం ఇచ్చిన ఈ మొక్కను.. పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాటారు. అందుకు సంబంధించిన ఫొటోలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్న ఆయన ప్రత్యేక పోస్టు పెట్టారు.
‘‘బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్తో భారత్ చేసిన యుద్ధంలో కచ్కు చెందిన తల్లులు, సోదరీమణులు తమ వీర పరాక్రమాలను ప్రదర్శించారు. ఇటీవల నేను గుజరాత్లో పర్యటన చేసిన సమయంలో ఆ మహిళా బృందం
నన్ను కలిసింది. అప్పుడే వారు నాకు ఈ మొక్కను అందించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటారు. ప్రధానమంత్రి నివాసంలో ఈ మొక్కను నాటే గొప్ప అవకాశం నాకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ
మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నంగా నిలుస్తుంది’’ అని ప్రధాని మోదీ పోస్టు చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను జత చేశారు. * సామాన్యుడి ప్రాణం విలువ చాయ్ కప్పు కంటే
చౌకనా?.. ‘తొక్కిసలాట’పై హర్ష్ గోయెంకా పోస్ట్ కాగా.. పహల్గాంలో ఉగ్రవాదులు మహిళల నుదుటి సిందూరాన్ని తుడిపేశారు. ఈ ఘటన తర్వాత ప్రతీకారానికి సిద్ధమైన భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో
పాకిస్థాన్పై దాడులు నిర్వహించింది. ఈ క్రమంలోనే 1971 యుద్ధంలో భాగమైన మహిళా బృందం ప్రధానికి ‘సిందూర’ మొక్కను బహూకరించింది. మోదీ మొక్క నాటుతున్న ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.