
Operation sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ కలిసి నిలబడదామంటూ ప్రముఖుల పోస్ట్లు..
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: పహల్గాంలో జరిగిన పైశాచిక చర్యకు భారత్ దీటైన స్పందన ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో
పాకిస్థాన్లోని (Pakistan) ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. దీనిపై ప్రముఖులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామంటూ భారత్ సైన్యంను ఉద్దేశిస్తూ పోస్ట్లు
పెడుతున్నారు. ‘జై హింద్’, ‘భారత్ మాతాకీ జై’, ‘ఆపరేషన్ సిందూర్’ అంటూ హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో పోస్ట్లు వెల్లువెత్తుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైనందుకు ఆనందంగా ఉందంటూ
అగ్ర కథానాయకుడు చిరంజీవి ‘జైహింద్’ అని రాశారు. * పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులు * ఎన్నో రోజుల నిశ్శబ్దం తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ భారతదేశం మొత్తంలో స్ఫూర్తిని నింపింది.
త్రివిధ దళాల ధైర్యం, అలాగే ఈ ఆపరేషన్కు నాయకత్వం వహించి సైన్యానికి అండగా ఉన్న ప్రధానమంత్రికి ధన్యవాదాలు. మేమంతా మీతోనే ఉన్నాం’’ - పవన్ కల్యాణ్ * మా ప్రార్థనలన్నీ భద్రతా బలగాలతో ఉంటాయి.
ఒకే దేశం.. కలిసి నిలబడదాం - ఆనంద్ మహీంద్రా (anand mahindra) * పోరాటం ఇప్పుడే ప్రారంభమైంది. లక్ష్యం పూర్తయ్యేవరకూ ఆగదు. దేశం మొత్తం మీతో ఉంది. జైహింద్ - రజనీకాంత్ * న్యాయం జరిగింది...
జైహింద్ - అల్లు అర్జున్ * ‘‘ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో మాత్రమే భారత్ చర్యలు చేపట్టింది. పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదు. మన దేశం లక్ష్యాలను
నిర్దేశించుకోవడంలో సంయమనం పాటించింది. 26 మందిని దారుణంగా చంపినందుకు మాత్రమే ఈ చర్యలు జరిపింది. మేం నిబద్ధతకు కట్టుబడి ఉంటాం’’ - ప్రకాశ్ రాజ్ * ప్రస్తుతం ప్రతి కదలిక పైనా దృష్టిపెట్టాలి.
అన్నిటినీ నిశితంగా పరిశీలించాలి. - విశ్వక్సేన్ * జై హింద్ కీ సేనా.. భారత్ మాతాకీ జై.. - రితేశ్ దేశ్ముఖ్ * భారత్ మాతా కీ జై.. న్యాయం జరిగింది - ఖుష్బూ * భద్రతా దళాలకు మరింత
బలాన్నివ్వాలని ప్రార్థిద్దాం. ఒకే దేశం.. కలిసి నిలబడదాం. వందేమాతరం - మధుర్ భండార్కర్ * ‘‘ప్రజల భద్రత కోసం ప్రార్థిద్దాం. ఉగ్రవాదం, దాడులు అనే పదాలు లేకుండా ప్రజలు ప్రశాంతమైన జీవితాలను
గడిపే రోజు కోసం ఎదురుచూస్తున్నాను. ప్రశాంతంగా, సుసంపన్నంగా జీవిద్దాం. జై హింద్ ’’ - విజయ్ దేవరకొండ