
Javed akhtar: పాకిస్థాన్ కంటే నరకం మేలు: జావేద్ అక్తర్
Play all audios:

పాకిస్థానా, నరకమా? అనే పరిస్థితి వస్తే నరకాన్నే ఎంచుకుంటానని రచయిత జావేద్ అక్తర్ అన్నారు. ఓ పుస్తకావిష్కరణలో ఆయన మాట్లాడారు. ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ కంటే నరకానికెళ్లడం బెటర్ అని
ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ (Javed Akhtar) తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ముంబయిలో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో మాట్లాడారు. ఉన్నది ఉన్నట్టు చెప్పే తాను వ్యతిరేకత ఎదుర్కొన్నట్టు తెలిపారు. ‘‘నేను
నాస్తికుడినని, నరకానికి వెళతానని కొందరు అంటారు. మరోవైపు, నేను జిహాదీనని, పాకిస్థాన్కు వెళ్లాలని అంటుంటారు. పాకిస్థానా, నరకమా? అన్న పరిస్థితి వస్తే నేను నరకాన్నే ఎంపిక చేసుకుంటా’’ అని
పేర్కొన్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ‘నరకాత్లా స్వర్గ్’ పుస్తకాన్ని రాశారు. ఈ కార్యక్రమంలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
* ‘బేబీ’ రీమేక్!.. వైదొలిగిన హీరో: స్పందించిన దర్శకుడు పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన జావేద్ కొన్ని రోజుల క్రితం పాల్గొన్న ఓ కార్యక్రమంలో.. గతంలో ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్కు తాను గట్టిగా
బదులిచ్చినట్లు చెప్పారు. ‘‘ఓసారి నేను లాహోర్లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరయ్యా. ఓ పాకిస్థానీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు గట్టి జవాబిచ్చా. ‘భారతీయులంతా వారిని (పాకిస్థానీయులను)
ఉగ్రవాదులుగా భావిస్తున్నారా?’ అని అడిగారు. ‘నేను ముంబయి వాసిని. నా నగరంపై ఎన్నోసార్లు దాడులు జరిగాయి. నా నగరం తగలబడటం నేను కళ్లారా చూశా. ఆ దాడులకు కారణం స్వీడన్, ఈజిప్ట్ నుంచి వచ్చిన వారు
కాదు.. వారంతా పాకిస్థాన్ నుంచి వచ్చినవారే. వారు ఇప్పటికీ పాక్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు’ అని చెప్పాను. ఆ మరుసటి రోజే నేను లాహోర్ నుంచి తిరిగి వచ్చాను. ఆ విషయంలో నేను అదృష్టవంతుడిని.
ఎందుకంటే నా కామెంట్స్ పాక్లో ఉద్రిక్తతలకు దారి తీశాయని విన్నాను’’ అని గుర్తుచేసుకున్నారు.