
Badra: 20 ఏళ్ల ‘భద్ర’.. ఈ హిట్ సినిమాను మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఎవరంటే..
Play all audios:

రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది ‘భద్ర’. ఈ సినిమా కథను ఇద్దరు హీరోలు వదులుకున్నారు. వాళ్లెవరంటే.. ఇంటర్నెట్ డెస్క్: రవితేజ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం
‘భద్ర’. నేటికి ఈ సినిమా విడుదలై 20ఏళ్లు పూర్తయింది (#20YearsForBhadra). రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా కథను అల్లు అర్జున్ (Allu Arjun), ఎన్టీఆర్ ఇద్దరూ మిస్
చేసుకోవడంతో రవితేజ అకౌంట్లోకి వెళ్లింది. ‘‘భద్ర’ సినిమా కథను బోయపాటి మొదట నాకు చెప్పారు. నాకు ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. కానీ, డేట్స్ కుదరకపోవడంతో దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అప్పుడు
ఆర్య సినిమా సెట్స్పై ఉంది. అది పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని బోయపాటికి చెప్పాను. ఈ కథను దిల్రాజుకు చెప్పడంతో ఆయన ఈ సినిమాను నిర్మించారు. దిల్రాజుకు కథ చెప్పాను కాబట్టే ఆ సినిమాలో
థ్యాంక్స్ కార్డు కూడా నాపేరు మీద పడింది’’ అని అల్లు అర్జున్ చెప్పారు. అప్పటినుంచి బోయపాటి - బన్నీ కాంబినేషన్లో ఎన్నో కథలు మధ్యలోనే ఆగిపోయాయి. చివరకు వీరిద్దరి కాంబోలో ‘సరైనోడు’ వచ్చింది.
* స్విమ్మింగ్ రాకపోయినా.. ‘వన్’ మూవీ కోసం మహేశ్బాబు సాహసం అలాగే ఈ సినిమా కథ చేయడానికి ఎన్టీఆర్కు (NTR) కూడా కుదరకపోవడం గమనార్హం. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా చెప్పారు. ‘‘భద్ర’ సినిమా కథను
బోయపాటి నాకు వినిపించినప్పుడు నిజంగా భయపడ్డాను. ఆయన కథ చెప్పే విధానం కూడా నన్ను భయపెట్టింది. ఆరోజు ఆయన వివరించిన తీరుకో లేదంటే కథకు నేను కనెక్ట్ కాలేకనో భద్రను వదులుకున్నాను. కానీ.. ఆ సినిమా
చేయలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతుంటాను. ఈ విషయం చెప్పడానికి నేనేం మొహమాటం పడడం లేదు’’ అని ఎన్టీఆర్ ఓ సందర్భంలో చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్లో ‘దమ్ము’ సినిమా వచ్చి హిట్ను సొంతం
చేసుకున్న విషయం తెలిసిందే. రవితేజ సరసన మీరా జాస్మిన్ నటించిన ‘భద్ర’ యూత్ను ఆకట్టుకుంది. ఆపదలో ఉన్న అమ్మాయిని రక్షించే యువకుడి కథగా ఇది రూపొందింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ సోషల్
మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. తెలుగులో సూపర్ హిట్ కావడంతో హిందీ, తమిళ్లోనూ రీమేక్ చేశారు.