
Karan johar: అలియాపై బంధుప్రీతి ఆరోపణలు.. వారికంటే మూర్ఖులు ఉండరన్న కరణ్ జోహార్
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి (నెపోటిజం) ఎప్పుడూ చర్చనీయాంశమే. ఎంతోమంది సెలబ్రిటీలు దీని కారణంగా వారికి అన్యాయం జరిగిందని పలు ఇంటర్వ్యూలో బహిరంగంగానే వెల్లడించారు. స్టార్
కిడ్స్కు అవకాశాలు వచ్చాయని వాపోయారు. బాలీవుడ్లో ఇది ఎప్పుడూ హాట్ టాపిక్గానే ఉంటుంది. స్టార్ హీరోయిన్ అలియా (Alia Bhatt) నెపోటిజం కారణంగానే ఈ స్థాయికి వచ్చారంటూ కొందరు కామెంట్స్
చేస్తుంటారు. తాజాగా వాటిపై దర్శకనిర్మాత కరణ్ జోహార్ స్పందించారు. అలా అనుకునే వారికంటే మూర్ఖులు ఉండరన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరణ్ (Karan Johar).. అలియా నటనపై ప్రశంసలు కురిపించారు.
‘‘అలియా నటించిన సినిమాలు చూడండి. ‘హైవే’, ‘రాజీ’, ‘గంగూబాయి కాఠియావాడి’ వంటి సినిమాలు చూడండి. అవి చూసిన తర్వాత కూడా ఆమెను నెపో కిడ్ అని పిలిస్తే.. మీకంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరు. ప్రపంచంలో
ఎవరూ మిమ్మల్ని బాగు చేయలేరు. ఆమె ఉత్తమ నటి’’ అని అన్నారు. ఇక ధర్మ ప్రొడక్షన్స్లో కేవలం స్టార్ కిడ్స్కు మాత్రమే అవకాశాలు ఇస్తారు అనే దానిని ఖండించారు. ఎంతోమంది బయటివారికి కూడా అవకాశాలు
ఇచ్చినట్లు తెలిపారు. * సమంత - రాజ్లపై రూమర్స్.. స్పందించిన మేనేజర్ సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా పరిచయమైన ‘నాదానియన్’ను కరణ్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అనుకున్న
స్థాయిలో అలరించలేకపోయింది. దీనిపై ఆయన విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. దీని గురించి తాజాగా వివరణ ఇచ్చారు. ‘‘ఈ సినిమాను నిర్మించినందుకు నన్ను చాలామంది ట్రోల్స్ చేశారు. అదే బయటివ్యక్తులతో
తీసినట్లైతే ఎవరూ గుర్తించేవారు కాదు. ‘నాదానియన్’ను ట్రోల్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. మీరు ఎంత ద్వేషిస్తే.. అది అంతగా ఫేమస్ అవుతుంది. ఎన్నో పాడ్కాస్ట్లలో దీని గురించి తెలియనివారు కూడా
మాట్లాడడం చూశాను. వారందరికీ నేను వివరణ ఇవ్వలేను. ఎవరి అభిప్రాయాలు వారివి’’ అని తెలిపారు.