
Kuwait: కువైట్లో ఘనంగా ‘రాగ తాండవం’.. ఉషాతో సంగీత ఝరి
Play all audios:

కువైట్: తెలుగు కళా సమితి (TKS) కువైట్ శుక్రవారం (మే 30) నిర్వహించిన ‘రాగ తాండవం’ సంగీత ఝరి కార్యక్రమం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని ఉషాతో పాటు గాయకుడు కౌండిన్య, ఇండియన్ ఐడల్
తెలుగు విజేత సౌజన్య, పవన్ ఆర్కెస్ట్రా బృందం చేసిన ‘రాగ తాండవం’ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా తెలుగు కళా సమితి (TKS) అధ్యక్షులు దోమరాజు కృష్ణంరాజు, ప్రధాన కార్యదర్శి గుర్రం
శ్రీనివాస్ మాట్లాడారు. విజయవంతంగా తమ పదవీకాలం ముగియడం సంతృప్తిగా ఉందన్నారు. తమకు సహకరించిన కమిటీ సభ్యులు, స్పాన్సర్లు, కార్యవర్గ సభ్యులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల అధికారులు
సాయి సుబ్బారావు, బాలరాజు, జ్యోత్స్న, హేమచంద్ర ఆధ్వర్యంలో ఏర్పడిన నూతన కమిటీకి స్వాగతం పలికారు. రెండు సార్లు అధ్యక్షురాలిగా చేసిన తెలుగు కళా సమితి కువైట్ ప్రథమ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న,
అధ్యక్షులు కృష్ణంరాజు, కార్యవర్గ సభ్యులను సన్మానించారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నుంచి వచ్చిన ప్రత్యేక అతిథి మధుసూదన్ రావు ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో జరిగిన సైబర్ అటాక్స్.. వాటిని భారత్
దీటుగా ఎదుర్కోవడం గురించి వివరించారు.