
Ipl 2025: ‘మీ విజయానికి బాంబులు పేలుస్తాం’.. జైపుర్ క్రికెట్ స్టేడియానికి బెదిరింపు మెయిల్
Play all audios:

Jaipur Stadium: ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్న జైపుర్ మైదానం అధికారులకు ఇవాళ ఉదయం ఓ మెయిల్ వచ్చింది. దీంతో హుటాహుటిన సెక్యూరిటీని పెంచేశారు. ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్, పాక్ ఆక్రమిత
కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఉగ్రస్థావరాలను కుప్పకూల్చింది. దాదాపు 100 మందిని మట్టుబెట్టినట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో
దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇదే సమయంలో జైపుర్ క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో భద్రతా దళాలు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. దీనిపై స్టేడియం అధికారులు
పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతోంది. జైపుర్ వేదికగానే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే, మే 16న పంజాబ్ కింగ్స్తో రాజస్థాన్ తన చివరి
లీగ్మ్యాచ్ను ఇక్కడే ఆడనుంది. జైపుర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం అధికారులకు ఉదయం 9.13 గంటలకు ఓ మెయిల్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఇందులో ఆపరేషన్ సిందూర్ గురించి పేర్కొంటూ.. ‘‘
ఆపరేషన్ సిందూర్ విజయానికి గుర్తుగా మేం మీ స్టేడియంలో బాంబు పేలుడు నిర్వహిస్తాం. వీలైతే ప్రతిఒక్కరినీ కాపాడుకోండి’’ అంటూ మెయిల్ వచ్చిందని తెలిపారు. ఈ మెయిల్పై అధికారిక వర్గాలు విచారణ
మొదలుపెట్టాయి.