
Ipl 2025: ఐపీఎల్ టికెట్ల డబ్బులు రీఫండ్
Play all audios:

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్లో మిగతా మ్యాచ్లు వారంపాటు వాయిదా పడ్డాయి. ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ (IPL) 2025
సీజన్లో మిగతా మ్యాచ్లు వారంపాటు వాయిదా పడ్డాయి. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ (BCCI) అధికారులు తెలిపారు. ‘దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్లు
నిర్వహించడం సరైన నిర్ణయం కాదు’ అని వారు వెల్లడించారు. మే 8న ధర్మశాల వేదికగా జరుగుతున్న పంజాబ్ కింగ్స్ (Punjab Kings), దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మ్యాచ్ను భద్రతా కారణాలరీత్యా
అర్ధాంతరంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ రోజు లఖ్నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) మధ్య మ్యాచ్ జరగాల్సి
ఉంది. కానీ బీసీసీఐ నిర్ణయంతో నేటి నుంచే నిలిపివేత అమల్లోకి రానుంది. దీంతో ఈ రోజు నుంచి ఐపీఎల్ మ్యాచ్లు జరగడం లేదు. ఈ నేపథ్యంలో అభిమానులకు టికెట్ల డబ్బులను ఫ్రాంఛైజీలు తిరిగి
చెల్లిస్తున్నాయి. ముందు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 10న ఉప్పల్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మధ్య మ్యాచ్
జరగాల్సి ఉంది. కానీ బీసీసీఐ నిర్ణయం మేరకు ఈ మ్యాచ్ రేపు జరగడం లేదు. దీంతో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు సన్రైజర్స్ యాజమాన్యం రీఫండ్ ప్రక్రియను చేపట్టింది.