
Saraswati pushkaralu: ముగిసిన సరస్వతి పుష్కరాలు.. ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్బాబు
Play all audios:

తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ముగిశాయి. కాళేశ్వరంలోని సరస్వతి ఘాట్ వద్ద జరిగిన పుష్కరాల ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. కాళేశ్వరం: తెలంగాణ సరస్వతి పుష్కరాలు ముగిశాయి.
కాళేశ్వరంలోని సరస్వతి ఘాట్ వద్ద జరిగిన పుష్కరాల ముగింపు వేడుకల్లో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. కాళేశ్వరంలో ఈ నెల 15న ప్రారంభమైన పుష్కరాలు నేటి వరకు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఆఖరి రోజున
మాడుగుల నాగఫణి శర్మ సరస్వతి పుష్కరాలు, కాళేశ్వర క్షేత్ర వైభవాన్ని భక్తులకు తెలియజేశారు. పండితులు సరస్వతి నవరత్న మాల హారతిని నిర్వహించారు. అనంతరం సరస్వతీ దేవీకి కర్పూర నీరాజనం సమర్పించారు.
పుష్కరాలకు చివరి రోజు కావడంతో భక్తులు పోటెత్తారు. దీంతో పుష్కర్ ఘాట్ పరిసరాలు శివనామస్మరణతో మర్మోగాయి. మొత్తం 12 రోజులపాటు సాగిన త్రివేణి సంగమంలో దాదాపు 30లక్షల మందికిపైగా భక్తులు
పుణ్యస్నానాలు ఆచరించారని అంచనా.