Maoists encounter: చర్చలకు రమ్మంటే కేంద్రం ససేమిరా అంటోంది: సీపీఐ(ఎం)

Maoists encounter: చర్చలకు రమ్మంటే కేంద్రం ససేమిరా అంటోంది: సీపీఐ(ఎం)

Play all audios:


దిల్లీ: మావోయిస్టు అధిపతి నంబాల కేశవరావు సహా 27 మందిని ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని కేంద్రానికి ఎన్ని సార్లు


విజ్ఞప్తి చేసినా ససేమిరా అంటూ ఒప్పుకోలేదని, ఇప్పుడు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రాణాలను బలిగొంటోందని ఆక్షేపించింది. ఈ మేరకు పార్టీ పొలిట్‌బ్యూరో ఓ ప్రకటన విడుదల చేసింది. అటు కేంద్రం గానీ,


ఇటు భాజపా నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం గానీ చర్చలకు అంగీకరించడంలేదని ప్రకటనలో పేర్కొంది. ‘‘చర్చలకు ముందుకు రాకుండా.. ‘నిర్మూలన’ అనే అమానవీయ విధానాన్ని కేంద్రం అవలంబిస్తోంది. కేంద్ర


హోంశాఖ మంత్రి అమిత్‌షా మావోయిస్టుల అంతానికి గడువు దగ్గరపడుతోందని పదేపదే చెబుతున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి కూడా చర్చలు అనవసరమంటున్నారు. ఈ ఇద్దరి తీరు ఫాసిస్టుల మనస్తత్వాన్ని


ప్రతిబింబిస్తున్నాయి. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం’’ అని సీపీఐ (ఎం) ప్రకటనలో పేర్కొంది. ప్రజలు, పలు రాజకీయ పార్టీలు చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాలకు చెవికెక్కడం


లేదని ఆరోపించింది. మావోయిస్టు చీఫ్ కేశవరావు ఎన్‌కౌంటర్‌ అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా స్పందిస్తూ.. నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఇదో మైలురాయి విజయం అని వ్యాఖ్యానించిన సంగతి


తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌ను సీపీఐ(ఎం)తో సహా సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌) ఖండించాయి. ఘటనపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్‌ చేశాయి. కేశవరావును చట్టబద్ధంగా అరెస్టు చేయకుండా ఎన్‌కౌంటర్‌లో హతమార్చడం..


ప్రజాస్వామ్య హక్కులపై ప్రశ్నలు రేకెత్తిస్తోందని సీపీఐ పేర్కొంది.