China: వేధింపులు, ఆధిపత్య ధోరణితో ఏకాకులవుతారు: జిన్‌పింగ్‌

China: వేధింపులు, ఆధిపత్య ధోరణితో ఏకాకులవుతారు: జిన్‌పింగ్‌

Play all audios:


China ఇంటర్నెట్‌డెస్క్‌: వేధింపులు, ఆధిప్యత ధోరణులు ప్రదర్శిస్తే.. ఒంటరిగా మిగిలిపోతారని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌-బీజింగ్‌ మధ్య వాణిజ్య ఒప్పందంలో ముందడుగు


పడటం.. టారిఫ్‌లకు తాత్కాలిక విరామం ఇచ్చిన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఎవరూ ఉండరని పునరుద్ఘాటించారు. వివిధ దేశాలు కలిసి పనిచేస్తేనే ప్రపంచ శాంతి.. సుస్థిరత


సాధ్యమన్నారు.  బీజింగ్‌లో బ్రెజిల్‌, కొలంబియా, చిలీ దేశాధ్యక్షులతో జరిగిన భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు.  ఇటీవల చర్చల సందర్భంగా టారిఫ్‌లను ఉపసంహరించుకోవడానికి అమెరికా, చైనా అంగీకరించాయి. వాణిజ్య


వివాదాలను పరిష్కరించుకోవడానికి, మరిన్ని చర్చలు జరిపే నిమిత్తం టారిఫ్‌ యుద్ధానికి 90 రోజుల విరామం ఇస్తున్నట్లు ఇరుదేశాలు సోమవారం ప్రకటించాయి. సుంకాన్ని 115% మేర తగ్గించిన ఇరుదేశాలు చైనా


వస్తువులపై టారిఫ్‌ రేటును 115% తగ్గించామని, దీంతో 145% సుంకం కాస్తా 30 శాతానికి పరిమితమైందని యూఎస్‌ ట్రేడ్‌ రెప్రెజెంటేటివ్‌ జేమిసన్‌ గ్రీర్‌ ప్రకటించారు. అమెరికా వస్తువులపై చైనా కూడా తన


సుంకాన్ని అంతేస్థాయిలో తగ్గించడంతో.. 125% కాస్తా 10 శాతానికి పరిమితం అవుతోంది. జెనీవాలో గ్రీర్, అమెరికా వాణిజ్య మంత్రి స్కాట్‌ బెసెంట్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. వాస్తవానికి ట్రంప్‌ టారిఫ్‌లు


విధించిన వేళ చైనా కూడా వెనక్కి తగ్గకుండా.. అమెరికా వస్తువులపై సుంకాలు వేసింది. అమెరికా వేధింపులకు ఎదురొడ్డి నిలిచిన దేశం వలే తనను తాను ప్రపంచానికి చూపించేందుకు ప్రయత్నించింది.