
Ukraine: రష్యా ఇంటెలిజెన్స్ కార్యాలయం పక్కనే.. ఉక్రెయిన్ గూఢచారుల మకాం..
Play all audios:

Ukraine | ఇంటర్నెట్డెస్క్: రష్యా నట్టింట ఉక్రెయిన్ గూఢచారులు కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసుకొని.. 41 బాంబర్ విమానాలను పేల్చేశారు. కీవ్ నిర్వహించిన ఈ షాకింగ్ ఆపరేషన్ వివరాలు మెల్లగా
బయటకు వస్తున్నాయి. దీనిని సమన్వయం చేసుకోవడానికి ఏకంగా రష్యా ఇంటెలిజెన్స్ సంస్థ ఎఫ్ఎస్బీ కార్యాలయం పక్కనే కోఆర్డినేషన్ సెంటర్ను నిర్వహించింది. ఈ విషయాన్ని స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడే
వెల్లడించారు. సోవియట్ నుంచి విడిపోయాక ది బుడాపెస్ట్ మెమొరాండం కింద తన వద్ద ఉన్న ఉక్రెయిన్ తన వద్ద ఉన్న 2,000 అణు వార్ హెడ్లు, 176 ఖండాంతర క్షిపణులు, డజన్ల కొద్దీ స్ట్రాటజిక్ బాంబర్లను
1996 జూన్ 1 నాటికి రష్యాకు బదిలీ చేసింది. దీనికి ప్రతిగా మాస్కో ఎప్పుడూ కీవ్పై దాడి చేయకూడదన్నది ఒప్పందం. కానీ, దీనికి భిన్నంగా ఇప్పుడు రష్యా దాడి చేసింది. ఈ అగ్రిమెంట్కు 29 ఏళ్లు నిండిన
రోజే రష్యా భూభాగం ఉక్రెయిన్ దాడి చేసింది.ఈ దాడిలో మొత్తం రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్లలో 34శాతం ధ్వంసమైనట్లు కీవ్ చేబుతోంది. ఈ దాడిని రష్యా ‘పెరల్ హార్బర్ ’ ఘటనగా పశ్చిమ దేశాల
పత్రికలు అభివర్ణిస్తున్నాయి. * భీకర దాడి.. రష్యాపై విరుచుకుపడిన ఉక్రెయిన్ స్థానిక డ్రైవర్లను ఎంచుకొని.. ఆపరేషన్ స్పైడర్ వెబ్కోసం ఉక్రెయిన్ 117 ఫస్ట్పర్సన్ వ్యూ ఆత్మాహుతి డ్రోన్లను
తొలుత రష్యాలోకి స్మగ్లింగ్ చేసింది. వీటి కొద్ది దూరం నుంచి పైలట్లు ఆపరేట్ చేయవచ్చు. చెక్కతో చేసిన క్యాబిన్లలో పెట్టి ట్రక్కులపై ఉంచి స్థానిక డ్రైవర్లను నియమించుకొని వైమానిక స్థావరాల వద్దకు
చేర్చింది. ఆదివారం మధ్యాహ్నం నాటికి ఈ లారీలలోని చెక్క క్యాబిన్ల డోర్లను రిమోట్ సాయంతో తెరిచింది. ఆ తర్వాత ఆత్మాహుతి డ్రోన్లు ఒక్కోటీ గాల్లోకి ఎగిరి రష్యా వ్యూహాత్మక న్యూక్లియర్ బాంబర్లపై
విరుచుకుపడ్డాయి. ఇందుకోసం రష్యా భూభాగంలోని మూడు టైమ్ జోన్లలో ఉక్రెయిన్ గూఢచారులు పనిచేశారు. ఈ ఆపరేషన్కు సహకరించిన వారిని ముందే ఆ భూభాగం నుంచి సురక్షితంగా బయటకు తెచ్చేసినట్లు జెలెన్స్కీ
వెల్లడించారు. ఈ ఆపరేషన్లో టీయూ-95, టీయూ-22ఎం3 బాంబర్లు, కీలకమైన ఏ-50 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి. వీటి ఉత్పత్తిని చాలా కాలం క్రితమే రష్యా ఆపేసింది. దీంతో ధ్వంసమైన విమానాలను భర్తీ
చేసుకోవడం ఆ దేశానికి దాదాపు అసాధ్యం. పశ్చిమ దేశాల అంచనాల ప్రకారం మాస్కో వద్ద మొత్తం 120 వరకు టీయూ95లు, టీయూ22ఎంలు ఉన్నాయి. ఉక్రెయిన్ పై బాంబింగ్లో ఇవే కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా
ఆయుధాల నుంచి తప్పించుకోవాలనుకొన్నా.. అమెరికా నుంచి కొన్ని ఆయుధాలు ఉక్రెయిన్లో ఉన్నాయి. 185 మైళ్ల రేంజిలో దాడి చేసే ఏటీఏసీఎంఎస్, స్ట్రామ్ షాడో క్షిపణుల నుంచి ఈ బాంబర్లను కాపాడుకొనేందుకు..
ఉక్రెయిన్ సరిహద్దునుంచి వేల మైళ్ల దూరంలో రష్యా భద్రపర్చింది. కానీ, ఉక్రెయిన్ స్పెషల్ సర్వీసు దళాలు ఆ దేశంలోకి చొచ్చుకొచ్చి.. ఎఫ్పీవీ డ్రోన్లతో 41 విమానాలను ధ్వంసం చేశాయి. ఈ దాడిలో
మాస్కోకు కనీసం 1.5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లి ఉంటుందని డెయిలీ మెయిల్ పత్రిక పేర్కొంది.