
Ap news: ఏపీ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ.. ప్రారంభించిన మంత్రులు
Play all audios:

పిఠాపురంలో రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ ప్రారంభమైంది. 29,796 రేషన్ దుకాణాల్లో సరకులు పంపిణీ
చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయం మేరకు చౌకధరల దుకాణాల్లో వీటిని అందజేస్తున్నారు. దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నారు. పిఠాపురంలో మంత్రి నాదెండ్ల మనోహర్
రేషన్ పంపిణీని ప్రారంభించారు. సత్యసాయి జిల్లా పెనకొండలో మంత్రి సవిత ప్రారంభించారు. వృద్ధులు, దివ్యాంగుల ఇంటి వద్దకే వెళ్లి ఆమె సరకులు అందజేశారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్, పార్వతీపురం
మన్యం జిల్లా సాలూరులో మంత్రి సంధ్యారాణి రేషన్ పంపిణీని ప్రారంభించారు. (Andhra Pradesh News) కర్నూలులో రేషన్ పంపిణీని ప్రారంభిస్తున్న మంత్రి టీజీ భరత్