
Shashi tharoor: ఓ భారతీయుడిగానే స్పందించా.. : శశిథరూర్
Play all audios:

దిల్లీ: భారత్- పాక్ ఉద్రిక్తతల సమయంలో వరుస వ్యాఖ్యలతో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Shashi Tharoor) లక్ష్మణ రేఖ దాటారని పార్టీ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై
శశిథరూర్ తాజాగా మాట్లాడారు. ఉద్రిక్తతల సమయంలో తాను ఓ భారతీయుడిగానే స్పందించానని.. పార్టీ అధికారిక వైఖరిని ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శశిథరూర్ దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..
‘‘ఇలాంటి కొన్ని విషయాల్లో నాకు పరిజ్ఞానం ఉంది కాబట్టే ప్రజలు నాపై నమ్మకముంచారని భావిస్తున్నా. అయినప్పటికీ ఎవరైనా నన్ను పరీక్షించుకోవచ్చు. కొన్నిసార్లు ప్రత్యక్షంగా, మరికొన్ని సందర్భాల్లో
పరోక్షంగా ఒక భారతీయుడిగా నా అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేస్తున్నాను’’ అని శశిథరూర్ పేర్కొన్నారు. * జేఎన్యూ బాటలో.. జామియా మిలియా ఇస్లామియా ‘లక్ష్మణ రేఖ’ దాటారని పార్టీ వర్గాలు
ఆరోపించడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ప్రత్యేక సమావేశంలో కూడా పాల్గొన్నాను. నా గురించి ఎటువంటి ప్రస్తావన రాలేదు. అయినా ఇలాంటి విషయాలు
ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియదు. ఇప్పటి వరకు పార్టీలో నా గురించి చర్చ జరిగినట్లు సమాచారం అందలేదు. అలాంటప్పుడు నేనెలా స్పందిస్తాను? ఏదైనా సమాచారం వచ్చిన తర్వాతే మాట్లాడతా’’ అని
కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, శశిథరూర్, ప్రియాంక గాంధీ, సచిన్ పైలట్ తదితరులు బుధవారం దిల్లీలో
సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం పార్టీ వర్గాలు శశిథరూర్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.