Crime news: 10 ఐఈడీ బాంబులను నిర్వీరం చేసిన భద్రతా బలగాలు

Crime news: 10 ఐఈడీ బాంబులను నిర్వీరం చేసిన భద్రతా బలగాలు

Play all audios:


భద్రాచలం: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో 10 ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. పోలీసులను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు అమర్చిన 10 మందుపాతరలను తొలగించారు. కోహకమేట


పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కోడాపారా, గుర్మ్కా అటవీప్రాంతంలో మందుపాతలను గుర్తించిన బలగాలు.. వాటిని వెలికితీశాయి. ఒక్కొక్కటి ఐదు కిలోలకుపైగా బరువు ఉన్నట్లు గుర్తించారు. మావోయిస్టులకు భద్రత


బలగాలకు ఎదురుకాల్పులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అడవుల్లోకి కూంబింగ్‌కు వచ్చే భద్రతా బలగాలను హతమార్చడానికి మావోయిస్టులు దారి పొడవునా ఐఈడీలను అమర్చారు. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు


కూంబింగ్‌ వెళ్తూ మందుపాతలను గుర్తించి నిర్వీర్యం చేశాయి.