Rohit sharma: ఓ ఎజెండా ప్రకారమే భారత్‌లో క్రికెట్ కామెంట్రీ: రోహిత్ వ్యాఖ్యలు

Rohit sharma: ఓ ఎజెండా ప్రకారమే భారత్‌లో క్రికెట్ కామెంట్రీ: రోహిత్ వ్యాఖ్యలు

Play all audios:


ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌కు చెందిన పలువురి క్రికెట్ కామెంట్రీపై రోహిత్ శర్మ (Rohit Sharma) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఓ పాడ్‌


కాస్ట్‌లో రోహిత్ మాట్లాడుతూ.. పదేపదే ఒకే క్రికెటర్‌పై దృష్టిపెట్టి, అతడి వ్యక్తిగత జీవితం గురించి కూడా కామెంట్లు చేయడం తగదన్నాడు. అలాకాకుండా ఆటగాడి నైపుణ్యం గురించి విశ్లేషిస్తే బాగుంటుందని


వ్యాఖ్యానించాడు. భారత్‌లో కామెంటేటర్లు ఏదొక ఎజెండాతో కామెంట్రీ చేస్తున్నట్లుగా ఉంటుందని పేర్కొన్నాడు. ఇతర దేశాల కామెంట్రీ ఒక్కోసారి బాగుంటుందని కితాబిచ్చాడు. భారత్‌లో క్రికెట్ జర్నలిజం తీరు


కూడా మారాల్సిన ఆవశ్యకత ఉందన్నాడు. * ఎవరు వీరంతా? మేమిద్దరం ఎప్పుడైనా అలా భావించామా?: గౌతమ్‌ గంభీర్ ‘‘కొంతమంది కేవలం వివాదాలను సృష్టించడంపై, అసలైన వార్తలను గాలికొదిలేయడంపై దృష్టిపెట్టారు.


దీని వల్ల నాణ్యమైన జర్నలిజం తగ్గిపోతుంది. ఇంతకుముందు క్రికెట్‌ చుట్టునే సంభాషణ జరిగేది. ఇప్పుడు మాత్రం తమ వీక్షణలు, లైక్‌లు, కథనాలను ఎక్కువ మంది చదివేందుకు ఇతర వివాదాలను తెరపైకి


తీసుకొస్తున్నారు. దీంతో ఆట గురించి రాయడం, మాట్లాడటం తక్కువైంది. వ్యూహాలు, విశ్లేషణ అసలే లేకుండా పోయింది. మనం టీవీల్లో మ్యాచ్‌ చూస్తున్నామనుకోండి.. ప్రస్తుత రోజుల్లో కామెంటేటర్ల మాటలను వింటే


చాలా నిరుత్సాహంగా అనిపిస్తోంది. అదే మీరు ఆస్ట్రేలియా లేదా ఇతర దేశానికి వెళ్లండి. వారి కామెంట్రీ చాలా భిన్నంగా ఉంటుంది. క్వాలిటీలోనూ మెరుగ్గా ఉంటుంది. కానీ, ఇక్కడ మాత్రం అలా సాధ్యం కావడం


లేదు.  ఏదొక ప్లేయర్‌ను తీసుకొని అతడిపైనే ఎక్కువగా మాట్లాడతారు. అదీనూ వ్యక్తిగత విషయాలను తీసుకొస్తారు. కానీ, చాలా మంది అభిమానులు క్రికెట్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటారు. వారికెందుకు


మీ మసాలా? వారంతా నిజమైన క్రికెట్ ప్రేమికులు. క్రికెటర్ ఎందుకు ఫామ్‌ కోల్పోయాడు? ఏం తప్పులు చేశాడు? అనేవి చూస్తారు. వారెప్పుడూ ప్లేయర్ల వ్యక్తిగత విషయాలను కోరుకోరు. కానీ, మీరు (కామెంటేటర్లు)


మాత్రం ఓ వేదికను చూసుకుని మాట్లాడేస్తారు. ప్లేయర్లకు కాస్త గౌరవం ఇవ్వండి. కొన్నిసార్లు సరైన ప్రదర్శన ఇవ్వలేకపోవచ్చు. అప్పుడు మేం విమర్శలకు అర్హులమే. న్యూజిలాండ్‌తో సరిగ్గా ఆడలేకపోయాం. కానీ,


అందుకూ ఓ విధానం ఉంటుంది. అంతేకానీ, ఒక ఎజెండాతో విమర్శలు చేయొద్దు. అది ఎవరికీ నచ్చదు’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఇప్పటికిప్పుడు తీసుకోలేదు: రోహిత్ చిన్ననాటి కోచ్ ‘‘రోహిత్ శర్మ టెస్టులకు


వీడ్కోలు పలకాలనే నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకోలేదు. ఫామ్‌ కోల్పోవడం వల్లే ఇలాంటి నిర్ణయానికొచ్చాడనే రూమర్లు సరైనవి కావు. తొందరపడి ఏమీ గుడ్‌బై చెప్పలేదు. టీ20ల నుంచి వైదొలిగి కుర్రాళ్లకు ఎలా


అవకాశం ఇవ్వాలని అనుకున్నాడో.. అదే తరహాలో టెస్టులను వదిలేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ గెలవాలని ముందు భావించాడు. కానీ, మనం ఫైనల్‌కు అర్హత సాధించలేదు. ఇప్పుడు రోహిత్ టార్గెట్ వన్డే ప్రపంచకప్


2027పైనే ఉంటుంది. అది గెలిచాక క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలని నేనూ కోరుకుంటున్నా’’ అని రోహిత్ చిన్ననాటి కోచ్ దినేశ్‌ లాడ్ వెల్లడించారు.