Nuclear facility: పాక్ అణుస్థావరాల నుంచి రేడియేషన్ లీక్ కాలేదు: ఐఏఈఏ

Nuclear facility: పాక్ అణుస్థావరాల నుంచి రేడియేషన్ లీక్ కాలేదు: ఐఏఈఏ

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌లోని ఏ అణు స్థావరం నుంచి కూడా అణుధార్మికత వెలువడలేదని, లీక్‌ కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) వెల్లడించింది. తమకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అలాంటి


పరిస్థితి ఏదీ లేదని తెలిపింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత రేడియేషన్ లీక్ గురించి పలు వార్తలు చక్కర్లు కొడుతోన్న తరుణంలో ఈ స్పందన వచ్చింది (Nuclear Facility In Pakistan). పహల్గాం ఉగ్రదాడికి


ఆపరేషన్ సిందూర్‌తో భారత బలగాలు గట్టి సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాయి. ఆ ఆపరేషన్‌లో భాగంగా పాక్‌లోని అణుకేంద్రాలను భారత్‌ టార్గెట్ చేసిందని పలు కథనాలు


వెలువడ్డాయి. మే 9 అర్ధరాత్రి, 10వ తేదీన పాకిస్థాన్‌లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశామని భారత్‌ ప్రకటించింది. పూర్తి స్వదేశీ ఆయుధాలతో దాడి చేసి 11 వాయుసేన


స్థావరాలను దెబ్బతీసినట్లు తెలిపింది. వీటిలో ఒక దాడి పాక్‌ న్యూక్లియర్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రాంగణంలో జరిగినట్లు వార్తలు వచ్చాయి. పాక్‌ చెప్పుకొంటున్న ప్రధానబలం అణ్వస్త్రం. ఆ బలంపైనే


దాడి చేయడంతో పాక్‌ సైనిక నాయకత్వం వెన్నులో వణుకుపుట్టి అమెరికాను ఆశ్రయించిందన్న వాదన వినిపించింది.  * భూగర్భ సొరంగాలు.. అణు కార్యక్రమాలు..! @ కిరానా హిల్స్‌ అణ్వాయుధాలను నిల్వచేసి ఉండొచ్చని


చెప్తున్న కిరానా హిల్స్‌.. సర్గోదా వైమానిక స్థావరానికి (ముషాఫ్‌ ఏయిర్‌బేస్‌) దగ్గరగా ఉన్నాయి. ఆ వైమానిక స్థావరాన్ని భారత్‌ టార్గెట్‌ చేసినట్లు మన సైన్యం ధ్రువీకరించగానే.. పాక్ అణు స్థావరంపై


దాడి గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. వీటన్నింటికీ ఎయిర్‌ చీఫ్ మార్షల్ ఏకే భారతి చెక్ పెట్టారు. ‘‘పాకిస్థాన్ తన అణ్వాయుధాలను కిరానా హిల్స్‌ వద్ద నిల్వ చేస్తుందని చెప్పినందుకు థాంక్స్‌.


అయితే, మేం ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేయలేదు’’ అని తెలిపారు. ప్రస్తుతం కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ.. అణ్వస్త్ర దేశాలపై భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరడంతో ప్రపంచమంతా


ఆందోళనకు గురైంది. ఆ సమయంలో దాయాది అణు బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిని ఉద్దేశించి మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కీలక ప్రశ్న సంధించారు. బాధ్యాతారాహిత్యంగా ఉండే పాక్‌ వద్ద ఉన్న


అణ్వాయుధాలు భద్రంగా ఉన్నాయా..? ప్రపంచాన్ని అడిగిన సంగతి తెలిసిందే.