ఎవరీ శ్రీపాద వల్లభ?.. ఆయన పేరును పవన్‌కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించారు?

ఎవరీ శ్రీపాద వల్లభ?.. ఆయన పేరును పవన్‌కళ్యాణ్ ఎందుకు ప్రస్తావించారు?

Play all audios:


పవన్ కళ్యాణ్ ప్రస్తావించినది... శ్రీపాద శ్రీ వల్లభ స్వామి గురించే. ఆయన క్రీస్తు శకం 1320లో పుట్టి.. 1351లో అంతర్దానం అయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో... సామర్లకోట దగ్గర... పిఠాపురం అనే


గ్రామంలో అప్పలరాజు శర్మ, సుమతి మహారాణి దంపతులకు జన్మించారు. ఈ స్వామిని... ప్రథమ దత్తాత్రేయ స్వామి అవతారంగా భావిస్తారు. శ్రీపాదవల్లభ స్వామి యువకుడిగా ఉన్నప్పుడు... అన్నీ వదిలేసి... ఉత్తర


భారత్ వెళ్లి తపస్సు చేశారు. చాలా పుణ్యక్షేత్రాలు దర్శించి... కృష్ణా నదికి కర్ణాటక వైపున ఉన్న కురువపురంలో స్థిరపడ్డారు. ఇది హైదరాబాద్‌కి 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇప్పుడు ఆధ్యాత్మిక


క్షేత్రంగా ఉంది. దీనికి 700 సంవత్సరాల చరిత్ర ఉంది. advertisement పీఠాపురం (శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి జన్మించిన గ్రామము) (IMAGES CREDIT - WIKIPEDIA - ADITYAMADHAV83) శ్రీపాద వల్లభ స్వామి ఒక


గుహలో ధ్యానం చేసేవారు. రాతి మంచంపై యోగా చేసేవారు. భక్తులు ఇప్పుడు అక్కడ ఆయన పాదం, అరచేతి గుర్తులను చూడవచ్చని చెబుతారు. దత్తాత్రేయుడి పునర్జన్మగా.. శ్రీపాదవల్లభ స్వామి... మహా సిద్ధులు, మహా


యోగులను ఆశీర్వదించారు. విశ్వంలో ధర్మాన్ని ఉద్ధరించారు. ప్రజలలో భక్తి శాంతి మార్గం బోధిస్తూ.. అంతర్థానం అయ్యారు. advertisement స్థల పురాణం ప్రకారం... హిమాలయాలకు చెందిన 28,000 మంది యోగులు,


సిద్ధులు కురువపురం క్షేత్రాన్ని సందర్శించారు. రోజు భారతదేశ నలుమూలల నుంచి, మహారాష్ట్ర , కర్ణాటక, గోవా, గుజరాత్ వంటి రాష్ట్రాలతోపాటూ... విదేశాల నుంచి కూడా భక్తులు కురువపురం సందరిస్తూ, స్వామి


ఆశీస్సులు పొందుతున్నారు. ఇలా ధర్మ పరిరక్షణ కోసం కృషి చేశారు కాబట్టే... పవన్ కళ్యాణ్ ... ఆ స్వామి పేరును కాకినాడలో ప్రస్తావించారు. మున్ముందు వారాహి యాత్రలో ఆయన ఇంకా ఎవరెవరి పేర్లు


ప్రస్తావిస్తారోనని ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులు. Location : Hyderabad,Telangana First Published : June 18, 2023 8:57 AM IST