
Ts inter results 2020 live updates | తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా...
Play all audios:

Published by: Last Updated:June 18, 2020 3:48 PM IST MANABADI TS INTER RESULTS 2020 | తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. రెండు సంవత్సరాల్లోనూ బాలికలు సత్తా చాటారు. తెలంగాణ ఇంటర్ పరీక్షల
ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండియర్ రెండు సంవత్సరాల ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. తెలంగాణలో రెండు సంవత్సరాలకు కలిపి 9,65,839 మంది
విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో మొదటి సంవత్సరం వారు 4,80,516 కాగా, రెండో సంవత్సరం విద్యార్థులు 4,85,323 మంది పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 4 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరిగాయి.
ఇంటర్ సెంకండియర్లో 2,83,462 మంది (68.86 శాతం) పాస్ అయ్యారు. వారిలో బాలికలు హవా చూపారు. బాలికలు హవా 75.15 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 62.10 శాతం పాస్ అయ్యారు. తెలంగాణ వచ్చాక ఇంత
స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం ఇదే ప్రథమం అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతస్థాయిలో ఉత్తీర్ణత శాతం రాలేదన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి 2,88,383 మంది
( 60.01 శాతం) పాస్ అయ్యారు. బాలికలు 67.47 శాతం, బాలురు 52.30 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం పాస్ అయిన విద్యార్థులకు సంబంధించిన మార్క్స్ మెమోలు ఐదు రోజుల్లో సంబంధిత జిల్లాలకు
పంపించనున్నారు. ఆయా జిల్లాల్లో కాలేజీల ప్రిన్సిపాల్స్ విద్యార్థుల మెమోలను జిల్లా ఇంటర్ ఎడ్యుకేషన్ అధికారుల వద్ద నుంచి తీసుకోవచ్చని తెలిపింది. ఈనెల 22 నుంచి విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి.
ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రిన్సిపాల్స్ జూలై 17వ తేదీలోపు ఫిర్యాదు చేయాలి. Location : First Published : June 18, 2020 3:16 PM IST Read More