
Pak spy: పాక్కు గూఢచర్యం ఆరోపణలు.. సీఆర్పీఎఫ్ ఉద్యోగి అరెస్ట్
Play all audios:

పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో టచ్లో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఆర్పీఎఫ్ ఉద్యోగి(CRPF personnel)ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇంటర్నెట్డెస్క్: భారత్కు సంబంధించిన సున్నిత
సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేస్తున్న వారిని గుర్తించి అరెస్టులు చేస్తున్నారు. ఈ జాబితాలో సీఆర్పీఎఫ్కు చెందిన సిబ్బంది ఒకరు (CRPF personnel) ఉండటం కలకలం సృష్టిస్తోంది. తాజాగా సీఆర్పీఎఫ్
ఉద్యోగి మోతీరామ్ జాట్ను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. 2023 నుంచి పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో అతడు టచ్లో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘‘నిందితుడు మోతీరామ్ జాట్ గూఢచర్యానికి
పాల్పడ్డాడు. దేశ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారుల(PIO)తో పంచుకున్నాడు. వేర్వేరు మార్గాల్లో పీఐఓల నుంచి డబ్బులు అందినట్లు గుర్తించాం’’ అని ఎన్ఐఏ ఒక ప్రకటనలో
పేర్కొంది. ఈ అభియోగాలపై అతడిని దిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక న్యాయస్థానం అతడిని జూన్ 6వరకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. పాకిస్థాన్తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్వర్క్ (Spy
Network)పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. కొన్ని వారాల వ్యవధిలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా సహా 10 మందికిపైగా అరెస్టయిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్
నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులు పాక్ నిఘావర్గాలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందన్నారు. వారి ఆర్థిక
లావాదేవీలను సునిశితంగా పరిశీలిస్తున్నామని, ఎలక్ట్రానిక్ పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా చేస్తున్నట్లు చెప్పారు.