
Pandemic: 2025లో మరో మహమ్మారికి కారణమయ్యే 5 అంటు వ్యాధులు ఇవే..!
Play all audios:

వేగంగా జరుగుతున్న ప్రపంచీకరణ, పట్టణీకరణ, పర్యావరణ మార్పుల వల్ల రాబోయే మహమ్మారి (Pandemic) అత్యంత ప్రమాదకారిగా ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు గతంలోనే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మహమ్మారిగా
మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసే సామర్థ్యం ఉన్న రోగకారకాలపై పరిశోధకులు నిరంతరం అధ్యయనం చేస్తూనే ఉన్నారు. మరి 2025లో ఆరోగ్య సంక్షోభాన్ని తీసుకొచ్చి, మరో మహమ్మారిగా మారే ప్రమాదం ఉన్న 5
తీవ్రమైన అంటు వ్యాధులు ఏవో చూద్దాం. advertisement ఎంపాక్స్ గతంలో మంకీపాక్స్గా పిలిచిన ఎంపాక్స్ మహమ్మారి, కోవిడ్-19 తర్వాత ప్రజల దృష్టిని ఆకర్షించిన వాటిలో ముందు వరుసలో ఉంది. ఇంది
వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో మరో మహమ్మారి (Pandemic) చుట్టుముట్టనుందనే భయాందోళనలు వినిపించాయి. కానీ, ఎట్టకేలకు కట్టుదిట్టమైన చర్యల ద్వారా దాని వ్యాప్తికి చెక్ పెట్టగలిగారు. కానీ, దీని
ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని వైద్య నిపుణులు తెలిపారు. స్మాల్పాక్స్ కుటుంబానికి చెందిన వైరస్ వల్లే ఇది వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తితో కాంటాక్ట్లోకి వచ్చిన వారికి ఇది
వ్యాపిస్తుంది. ఇటీవల కాలిఫోర్నియాలో అత్యంత తీవ్రతతో కూడిన ఎంపాక్స్ కేసును గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. దీన్ని అరికట్టడానికి తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని అమెరికన్ వైద్యులు ఆందోళన
వ్యక్తం చేశారు. advertisement బర్డ్ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా 2024లో 60 మందిలో బర్డ్ఫ్లూను గుర్తించారు. అమెరికాలో అత్యంత తీవ్రమైన కేసు నమోదైంది. అయితే, ఇది మనిషి నుంచి మనిషికి
వ్యాపిస్తుందనడానికి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రమాదం తప్పదని
హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డెయిరీలు, పౌల్ట్రీ ఫామ్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలియో పోలియో కథ ముగిసినట్లేనని చాలా మంది భావిస్తున్నారు. కానీ, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్
వంటి దేశాల్లో ఇది విజృంభిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. ఇది ఇతర దేశాలకూ విస్తరించే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించిన వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం ఊరట కలిగించే విషయం. అయితే, ఈతరం
తల్లిదండ్రులకు పోలియో మహమ్మారి లక్షణాలు, దాని ప్రభావంపై అంతగా అవగాహన ఉండట్లేదు. అందుకే చిన్నారుల్లో ఏమాత్రం అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలి.
advertisement డిసీజ్ ‘ఎక్స్’ ఈ పదాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించింది. ఇది ఊహాజనిత వ్యాధి. ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు. కానీ, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉన్న వ్యాధి కారకం
ఎప్పుడైనా వెలుగులోకి రావచ్చనే ఉద్దేశంతో దీనికి అలా నామకరణం చేశారు. రాబోయే మహమ్మారిని (Pandemic) సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నద్ధత కోసం ఇలా ప్లాన్ చేశారు. కాంగోలో ఆ
మధ్య ఓ అంతుచిక్కని వ్యాధిని గుర్తించారు. ప్రాథమికంగా దాన్ని ‘డిసీజ్ ఎక్స్’గా పిలిచారు. కానీ, తర్వాత జరిపిన లోతైన వైద్య పరీక్షల్లో అది తీవ్రమైన మలేరియా అని తేలింది. advertisement మీజిల్స్
మీజిల్స్.. దీన్ని తెలుగులో ప్రాంతాన్ని బట్టి తట్టు, అమ్మవారు, మశూచి అని పిలుస్తారు. దీని కథ దాదాపు ముగిసిందనే అందరూ అనుకుంటున్నారు. కానీ, ఇటీవల కొన్ని దేశాల్లో ఈ వ్యాధిని గుర్తించారు.
2024లో అమెరికాలో 280 కేసులు నమోదయ్యాయి. వ్యాక్సినేషన్ పడిపోవడమే దీనికి కారణమని వైద్య నిపుణులు తేల్చారు. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఏం చేయాలి? 2019లో కోవిడ్ మహమ్మారి వెలుగులోకి వచ్చిన
తొలినాళ్లలో చాలా నిర్లక్ష్యంగా వ్యహరించారు. విచ్చలవిడిగా ప్రయాణించారు. దీంతో అది ప్రపంచం మొత్తం పాకి ఊహించని విపత్తును మిగిల్చింది. ఈసారి అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
advertisement అలాగే కరోనా మహమ్మారి మిగిల్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయాలి. తప్పుడు సమాచారం వ్యాప్తి జరగకుండా చూడాలి. ప్రజలు సైతం ఏమాత్రం లక్షణాలు కనిపించినా
నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. మరింత మందికి వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ వ్యాధి ఎలాంటి ప్రమాదానికి దారితీస్తోందో తెలియదు. అందుకే అత్యంత అప్రమత్తతో వ్యహరించాలి.
పరిశోధకులు వ్యాక్సిన్లు, వ్యాధి కారకాలపై నిరంతరం అధ్యయనం కొనసాగించాలి. Disclaimer ఈ వార్తలో వివరించిన ఔషధం, డ్రగ్స్, ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం నిపుణులతో సంభాషణ ఆధారంగా అందించినది. ఇది
సాధారణ సమాచారం మాత్రమే. వ్యక్తిగత సలహా కాదు. అందువల్ల, ఏదైనా ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించండి. ఏదైనా ఉపయోగించడం వల్ల కలిగే నష్టానికి లోకల్-18 బాధ్యత వహించదు. Location :
Hyderabad,Telangana First Published : January 04, 2025 4:35 PM IST