
Star hospital: భార్య కిడ్నీ, కొడుకు లివర్ దానం.. అరుదైన ఘనత సాధించిన స్టార్ హాస్పిటల్..
Play all audios:

Reported by: Published by: Last Updated:December 17, 2024 4:56 PM IST ఒంగోలు చెందిన ఉపాధ్యాయుడు రమేష్, 54 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, నానాక్ రాంగూడలోని స్టార్ హాస్పిటల్లో
ఒకే సమయంలో కాలేయం మరియు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. ఒంగోలు చెందిన ఉపాధ్యాయుడు రమేష్, 54 ఏళ్ల వయసులో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, నానాక్ రాంగూడలోని స్టార్ హాస్పిటల్లో ఒకే
సమయంలో కాలేయం మరియు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయనకు అధిక రక్తపోటు, మధుమేహం, మరియు హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాడు. ఇక చివరకు తాను
బతుకుతాడు లేదో అనే పరిస్థితికి చేరింది. భార్య తన కిడ్నీని, కుమారుడు తన లివర్ను దానం చేయడంతో ఈ అరుదైన ఆపరేషన్ సాధ్యమైంది. స్టార్ హాస్పిటల్స్ ట్రాన్స్ప్లాంట్ హెపటాలజీ విభాగం నిపుణుడు డాక్టర్
గోలమారి శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో 50 మంది వైద్యుల బృందం, 15 గంటల పాటు శ్రమించి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అవయవ మార్పిడి చికిత్స కోసం ప్రజలలో
అవగాహన పెరగడం చాలా అవసరమని, అవయవ దానం ద్వారా మరిన్ని ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఇలాంటి చికిత్సల గురించి ప్రజల్లో అనుమానాలు ఉన్నప్పటికీ, ఆధునిక వైద్య సాంకేతికత వాటిని అధిగమించగలదని
స్పష్టం చేశారు. అంతేగాక.. అవయవ దానం గురించి అపోహలు వీడి, ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఆపరేషన్ విజయవంతమవడం వల్ల.. కేవలం రమేష్ ప్రాణాలే కాకుండా, అవయవ దానానికి సంబంధించిన అవగాహన మరింత
విస్తృతమయ్యే అవకాశముంది. కుటుంబసభ్యుల త్యాగం, వైద్యుల నైపుణ్యం అనేక మంది ప్రేరణగా నిలుస్తుంది. Location : Hyderabad,Telangana First Published : December 17, 2024 4:56 PM IST Read More