
Vallabhaneni vamsi: నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు.. వల్లభనేని వంశీకి 14 రోజులు రిమాండ్
Play all audios:

నూజివీడు: నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అతడి అనుచరుడు మోహన్ రంగారావుకు కూడా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏలూరు
జిల్లా బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు వీరిపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఈనెల 29 వరకు రిమాండ్ విధించడంతోపాటు పీటీ వారెంట్కు అనుమతిచ్చింది.