
Nandigam suresh: నందిగం సురేశ్కు జూన్ 2 వరకు రిమాండ్
Play all audios:

వైకాపా నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్కు (Nandigam Suresh) మంగళగిరి కోర్టు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. ఆయన్ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారు. మంగళగిరి: వైకాపా నేత, మాజీ
ఎంపీ నందిగం సురేశ్కు (Nandigam Suresh) మంగళగిరి కోర్టు జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. ఆయన్ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం
ఉద్దండరాయునిపాలెంలో తెదేపా కార్యకర్త రాజుపై దాడి చేసిన కేసులో ఆదివారం ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కోర్టులో హాజరుపరచడానికి ముందు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో నందిగం సురేశ్కు వైద్య
పరీక్షలు నిర్వహించారు. బీపీ, మధుమేహం స్థాయులను పరీక్షించారు. సురేశ్ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కోర్టు ప్రాంగణంలో ఇతరులను ఖాళీ చేయించారు. ఆయన
అనుచరులు భారీగా చేరుకోవడంతో వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. (Andhra Pradesh News)