Operation sindoor: ఈసారి భారత్‌ ఏం చేస్తుందో పాకిస్థాన్‌కు తెలుసు - వైస్‌ అడ్మిరల్‌

Operation sindoor: ఈసారి భారత్‌ ఏం చేస్తుందో పాకిస్థాన్‌కు తెలుసు - వైస్‌ అడ్మిరల్‌

Play all audios:


పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)ను పాక్‌ సైన్యం దాటలేదని భారత త్రివిధ దళాలు స్పష్టంచేశాయి. ఆపరేషన్‌ సమయంలో లక్ష్యాలను ఛేదించడంపైనే గురి ఉంటుందని పేర్కొన్నాయి. ఇంటర్నెట్ డెస్క్‌:


పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)ను పాక్‌ సైన్యం దాటలేదని భారత త్రివిధ దళాలు స్పష్టంచేశాయి. ఆపరేషన్‌ సమయంలో లక్ష్యాలను ఛేదించడంపైనే గురి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే, ఆపరేషన్‌ సిందూర్‌


(Operation Sindoor) సమయంలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారని, అమర జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మరచిపోదని తెలిపాయి. పాక్‌ విమానాలను కూల్చేశాం ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా పాకిస్థాన్‌కు చెందిన


కొన్ని అత్యాధునిక విమానాలను కూల్చేశామని ఎయిర్‌ మార్షల్ ఏకే భారతీ వెల్లడించారు. భారత యుద్ధ విమానాలను పాకిస్థాన్‌ నిర్బంధించినట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. భారత పైలట్లందరూ సురక్షితంగా


తిరిగి వచ్చారని చెప్పారు. మన స్థావరాలపై దాడి చేసేందుకు వారు చేసిన ప్రయత్నాలను గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని అన్నారు. సంసిద్ధంగా నౌకాదళం ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత నౌకాదళం కూడా


పూర్తి సంసిద్ధతతో ఉందని ఇండియన్‌ నేవీ వెల్లడించింది. పహల్గాం దాడి తర్వాత వెంటనే అప్రమత్తమయ్యామని, బలగాలతో పాటు సబ్‌మెరైన్లను సముద్రంలో మోహరించామని తెలిపింది. అవసరమైతే కరాచీ పోర్టు కూడా తమ


లక్ష్యాల్లో ఒకటని పేర్కొంది. తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహన నేపథ్యంలో పాకిస్థాన్‌ నేవీ, ఎయిర్‌బేస్‌లపై నిఘా పెట్టామని.. ఈసారి పాక్‌ ఉల్లంఘనలకు పాల్పడితే భారత్‌ ఏం చేయనుందో వారికి తెలుసునని


వైస్‌ అడ్మిరల్‌ ఏఎన్‌ ప్రమోద్‌ పేర్కొన్నారు.