
Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. రూ. 33వేల కోట్ల పెట్టుబడులపై చర్చ
Play all audios:

అమరావతి: సచివాలయంలో సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం కొనసాగుతోంది. 19 ప్రాజెక్టులకు సంబంధించిన రూ. 33వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలపై సమావేశంలో చర్చిస్తున్నారు.
35వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలపనుంది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలకు చెందిన వివిధ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
ఈ పెట్టుబడులపై సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్, వాసంశెట్టి సుభాష్, సీఎస్ కె. విజయానంద్,
ఉన్నతాధికారులు హాజరయ్యారు.