
Stock market: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 300 పాయింట్లు జంప్
Play all audios:

Stock Market Opening Bell | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు కాస్త అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్
ప్రారంభంలోనే 150 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్.. భారతీ ఎయిర్టెల్, ఇన్ఫీ వంటి ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో రాణిస్తోంది. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 387 పాయింట్ల లాభంతో
81,517 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 118 పాయింట్ల లాభంతో 24,696 వద్ద ఉన్నాయి. సెన్సెక్స్ 30 సూచీలో.. టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, రిలయన్స్
ఇండస్ట్రీస్, బజాజ్ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎటర్నల్, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్, ఏషియన్
పెయింట్స్, నెస్లే ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, సన్ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్యూఎల్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్
బ్యారెల్ 66.18 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్సు 3,234 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. * క్షిపణి వేగంతో బీడీఎల్, మిధానీ షేర్లు అమెరికా ప్రధాన సూచీలైన నాస్డాక్, ఎస్ అండ్ పీ 500 నిన్నటి
ట్రేడింగ్ సెషన్లో లాభంతో ముగియగా.. డోజోన్స్ మాత్రం ఫ్లాట్గా ముగిసింది. ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియన్ ఏఎస్ఎస్ 0.11 శాతం, జపాన్ నిక్కీ 0.81 శాతం
నష్టంతో కదలాడుతుంటే.. షాంఘై 1.42 శాతం, హాంకాంగ్ హాంగ్సెంగ్ మాత్రం 0.21 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) తిరిగి విక్రయదారులుగా నిలిచారు. మంగళవారం నికరంగా రూ.477
కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. ఇక దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.4,274 కోట్ల షేర్లు కొనుగోలు చేశారు.