Suzuki e-access: సుజుకీ ఇ-యాక్సెస్‌ తయారీ ప్రారంభం

Suzuki e-access: సుజుకీ ఇ-యాక్సెస్‌ తయారీ ప్రారంభం

Play all audios:


Suzuki e-Access: విద్యుత్తు స్కూటర్‌ ఇ-యాక్సెస్‌ తయారీని గురుగ్రామ్‌ ప్లాంట్‌లో ప్రారంభించినట్లు సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా తెలిపింది. Suzuki e-Access | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ద్విచక్ర


వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా (Suzuki Motorcycle) తన పాపులర్‌ స్కూటర్‌ యాక్సెస్‌లో ఈవీ వేరియంట్‌ను తీసుకొస్తోంది. భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025లో తొలిసారిగా


ప్రదర్శించిన ఇ-యాక్సెస్‌ తయారీని గురుగ్రామ్‌ ప్లాంట్‌లో ప్రారంభించినట్లు తెలిపింది. త్వరలోనే ఈవీకి మార్కెట్లోకి విడుదల చేయనుంది. విద్యుత్‌ స్కూటర్‌ విభాగంలోకి సుజుకీ అడుగుపెట్టాలని


చాలాకాలంగా చూస్తోంది. ఇ-యాక్సెస్‌తో ఎంట్రీ ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తోంది. దీర్ఘకాల మన్నిక, అత్యుత్తమ థర్మల్‌ స్టెబిలిటీతో కూడిన ఇ-టెక్నాలజీతో ఈ విద్యుత్తు స్కూటర్‌ను రూపొందిస్తున్నట్లు


పేర్కొంది. లిథియం ఐరన్‌ ఫాస్పేట్‌ (LFP) బ్యాటరీ ఈ స్కూటర్‌ను తీసుకొస్తున్నారు. రీ జెనరేటివ్‌ బ్రేకింగ్‌, ఫ్రీ బెల్ట్‌ డ్రైవ్‌ సిస్టం, రివర్స్‌ మోడ్‌తో పాటు (ఎకో మోడ్‌, రైడ్‌ మోడ్‌ ఏ, రైడ్‌


మోడ్‌ బీ) అనేక రకాల రైడింగ్‌ మోడ్స్‌తో రానుంది.  * యాపిల్‌ మాత్రమే కాదు.. శాంసంగ్‌ పైనా ట్రంప్‌ టారిఫ్‌ బాంబ్‌ సుజుకీ కొత్త విద్యుత్‌ స్కూటర్‌ ఇ-యాక్సెస్‌ 3kWh బ్యాటరీతో తీసుకొస్తున్నారు.


ఇది 95 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. పోర్టబుల్‌ ఛార్జర్‌తో 6 గంటలు 12 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జ్‌, ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే 2 గంటల 12 నిమిషాల్లో ఛార్జ్‌ పూర్తవుతుందని కంపెనీ


వెల్లడించింది. 5.5 hp, 15 Nm పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వచ్చే వారంలో స్కూటర్‌ ధరను రివీల్‌ చేయనుంది.