
Akhilesh yadav: కుమార్తె పేరిట నకిలీ ‘ఎక్స్’ ఖాతా.. 24గంటలైనా చర్యల్లేవంటూ మాజీ సీఎం ట్వీట్
Play all audios:

తన కుమార్తె పేరిట దుండగులు నకిలీ ‘ఎక్స్’ ఖాతా తెరిచారని, దాన్ని నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) డిమాండ్
చేశారు. లఖ్నవూ: తన కుమార్తె పేరిట దుండగులు నకిలీ ‘ఎక్స్’ ఖాతా తెరిచారని, దాన్ని నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh
Yadav) డిమాండ్ చేశారు. ఈ ఖాతాలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్ఫింగ్ ఫొటోలు షేర్ చేశారనీ.. ఈ ఘటన వెలుగులోకి వచ్చి 24గంటలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని
ఆక్షేపించారు. దీన్ని ఎఫ్ఐఆర్ కంటే తక్కువగా పరిగణించొద్దని కోరుతూ వివాదాస్పద పోస్టు స్క్రీన్ షాట్ను ఆయన జత చేశారు. * ఒక పరీక్ష మిమ్మల్ని ఎప్పటికీ నిర్వచించలేదు: విద్యార్థులకు ప్రధాని
మోదీ సూచన ‘‘అభ్యంతరకరంగా ఉన్న అనేక పోస్టులు మా దృష్టికి వచ్చాయి. కొందరు సంఘ వ్యతిరేక శక్తులు మా కుటుంబం, పార్టీ నేతలు, మాకు సన్నిహితంగా ఉన్న వ్యక్తుల పేర్లు, ఫొటోలను దుర్వినియోగం
చేస్తున్నారు.అత్యంత ఖండించదగిన పోస్టులు, కంటెంట్ను పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టులతో మాకు సంబంధం లేదు. ఇదంతా ఓ కుట్రలో భాగంగా జరుగుతోంది. దీని వెనుక కొందరు దుర్మార్గుల రాజకీయ, ఆర్థిక
ఉద్దేశాలు దాగి ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. భాజపా ప్రభుత్వ సైబర్ భద్రతా విభాగం నిజంగా చర్యలు తీసుకోవాలనుjకుంటే.. 24గంటల్లో కాదు.. కేవలం 24 నిమిషాల్లోనే పట్టుకోగలదన్నారు. కాకపోతే.. వారు
పైనుంచి వచ్చే ఆదేశాల కోసం వేచి చూస్తున్నారని అఖిలేశ్ విమర్శించారు.