Operation sindoor: భారత్‌ ఓవైపు.. పాక్‌ సైబర్‌ మంద మరోవైపు..

Operation sindoor: భారత్‌ ఓవైపు.. పాక్‌ సైబర్‌ మంద మరోవైపు..

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్‌: ఓవైపు భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌లో తలమునకలైన వేళ పాకిస్థాన్‌ మిత్రదేశాలు మొత్తం ఏకమై ఇండియాపై సైబర్‌ దాడులు నిర్వహించినట్లు మన దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిల్లో కొన్ని


ఆయా ప్రభుత్వాల హ్యాకింగ్‌ గ్రూపులు కాగా.. మరికొన్ని ప్రభుత్వేతరమైనవి. పాకిస్థాన్‌, తుర్కియే, బంగ్లాదేశ్‌, మలేసియా, ఇండోనేసియా, ఇరాక్‌, చైనాకు సంబంధించినవి ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. 


ముఖ్యంగా ప్రభుత్వరంగ సంస్థలు, ఎంఎస్‌ఎంఈ వ్యాపారులు, పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, పవర్‌గ్రిడ్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌ సర్వీసులు వంటి వాటిని ఇవి లక్ష్యంగా చేసుకొన్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌, యూపీఐ,


డిజిటల్‌ వాలెట్స్‌, స్టాక్‌ ఎక్స్‌ఛేంజీలు, దిగ్గజ కంపెనీలు వీటిల్లో ఉన్నాయి. రక్షణ రంగ సంస్థల నుంచి కూడా డేటా చౌర్యానికి యత్నించాయి. దీనిని భారత డిజిటల్‌ ఆస్తులపై పాక్‌ చేసిన సైబర్‌ యుద్ధంగా


ఇంటర్‌పోల్‌ ట్రెయిన్‌ పెండ్యాల కృష్ణశాస్త్రి వెల్లడించినట్లు ఓ ఆంగ్లపత్రిక కథనంలో పేర్కొంది. ఇటీవల ది సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ సైబర్‌ దాడికి గురైంది. దాని సిస్టమ్‌లో మిస్టర్‌


హబిబ్‌404 పేరిట ఓ మెసేజ్‌ కనిపించింది. ‘‘సురక్షితమే అని మీరు అనుకొంటున్నారా.. మేము ఇక్కడే ఉన్నాం’’ అనే సందేశం కనిపించింది. ఆ తర్వాత ఈ వెబ్‌సైట్‌ను రీస్టోర్‌ చేశారు.  ఏకమైన పాక్‌ అనుకూల


గ్రూపులు ఇవే.. ఈ హ్యాకింగ్‌ గ్రూపుల్లో కొన్ని పేర్లు వెల్లడయ్యాయి. ఇస్లామిక్‌ హ్యాకర్స్‌ ఆర్మీ (ఇరాక్‌), టీమ్‌ అజ్‌రాయిల్‌-ఏంజెల్‌ ఆఫ్‌ డెత్‌ (పాలస్తీనా) సైల్హెట్‌ గ్యాంగ్‌ ఎస్‌జీ


(బంగ్లాదేశ్‌) డైనెట్‌ (బంగ్లాదేశ్‌), ఏపీటీ 36, పాకిస్థాన్‌ సైబర్‌ ఫోర్స్‌, టీమ్‌ ఇన్సేన్‌ పాక్‌, మిస్టీరియస్‌ బంగ్లాదేశ్‌, ఇండో హ్యాక్‌ సెక్‌, సైబర్‌ గ్రూప్‌ హోక్స్‌, నేషనల్‌ సైబర్‌ క్రూ


(పాకిస్థాన్‌) వంటివాటిని గుర్తించారు. ఇవి గత వారం నుంచి తరచూ సైబర్‌ దాడులు చేసి భారత్‌ నుంచి డేటా చౌర్యం చేసినట్లు 100కు పైగా క్లెయిమ్‌లు చేశాయి. వీటిల్లో ఎంతవరకు నిజం అనే వాటిని భారత్‌


వర్గాలు మాత్రం ధ్రువీకరించలేదు. బంగ్లాదేశ్‌కు చెందిన సైల్హెట్‌ గ్యాంగ్‌ ఎస్‌జీ, డైనెట్‌లు భారత్‌లోని నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ నుంచి 247 జీబీ డేటాను తస్కరించినట్లు పేర్కొన్నాయి. ఈ సంస్థలు


వాటిల్లో కొంత బహిర్గతం చేయగా.. వాటిని క్లౌడ్‌ ఎస్‌ఈకే(CloudSEK) సంస్థ విశ్లేషించి అది పబ్లింగ్‌ అందుబాటులో ఉన్నదేనని వెల్లడించింది. అజ్‌రాయిల్‌-ఏంజెల్‌ ఆఫ్‌ డెత్‌ 10 లక్షల మంది ప్రజల డేటాను


ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి అపహరించినట్లు వెల్లడించింది. అది 2023లో రీసైకిల్‌ చేసిన డేటాగా తేలింది.  ఆపరేషన్‌ సిందూర్‌ వేళ పాకిస్థాన్‌ మద్దతుతో నడిచిన హ్యాకింగ్‌ సంస్థలు భారత పవర్‌ గ్రిడ్‌లో


70శాతం కుప్పకూల్చామని ప్రకటించుకొన్నాయి. కానీ, ఇది పూర్తిగా అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ వెల్లడించింది. పాక్‌ యుద్ధంలో పైచేయి సాధించిందనే ప్రచారం కోసం శాటిలైట్‌ జామ్‌ చేశామని, నార్తర్న్‌


కమాండ్‌తో సంబంధాలు తెంపేశామని, బ్రహ్మోస్‌ స్టోరేజీ డిపోను పేల్చామని పాక్‌ ముఠాలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే.  ఒక ముప్పు వాస్తవమే.. పాక్‌కు చెందిన ఏపీటీ 36 గ్రూపుతో అప్రమత్తంగా ఉండాలని


సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. దీనికి ట్రాన్సపరెంట్‌ ట్రైబ్‌ అనే నిక్‌నేమ్‌ కూడా ఉంది. ఈ గ్రూపు మాల్వేర్‌ పేలోడ్స్‌ దాడులు చేస్తుంది. ఇది వాడే వాటిల్లో అల్లాకొరె, క్రిమిసన్‌ రాట్‌ వంటివి


ఉంటున్నాయి.  ఇవి సోకిన కంప్యూటర్లపై ఏపీటీ 36 గ్రూప్‌కు అపరిమిత నియంత్రణ లభిస్తుంది.