
Operation sindoor: ఆపరేషన్ సిందూర్’.. 70 దేశాల దౌత్యాధికారులకు బ్రీఫింగ్
Play all audios:

Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ గురించి 70 దేశాల దౌత్యాధికారులకు రక్షణ నిఘా సంస్థ డీజీ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ రాణా వివరించారు. ఇంటర్నెట్డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్,
పాకిస్థాన్లోని ఉగ్రస్థావరాల లక్ష్యంగా మన సైన్యం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీని గురించి రక్షణ నిఘా సంస్థ డీజీ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్
రాణా 70 దేశాల దౌత్యాధికారులకు వివరించారు. లక్ష్యాల ఎంపిక ప్రక్రియ, భారత శక్తిసామర్థ్యాల ప్రదర్శన తదితర అంశాలను తెలియజేశారు. భారత్కు వ్యతిరేకంగా ప్రత్యర్థులు చేసిన తప్పుడు ప్రచారాన్ని,
దానివల్ల ప్రాంతీయ స్థిరత్వంపై గల ప్రభావాన్ని విశదీకరించారు. అలాగే ఆ తప్పుడు సమాచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరును వెల్లడించారు. ఉగ్ర ముఠాలకు అండగా ఉంటూ సీమాంతర ఉగ్రవాదాన్ని
ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’తో శత్రుదేశాన్ని అన్నివిధాలుగా దెబ్బతీసిన న్యూదిల్లీ.. ఇప్పుడు దాయాది (Pakistan)పై
ద్వైపాక్షికంగా ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ రోజు పలు దేశాల అధికారులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇచ్చింది. దిల్లీలోని రక్షణశాఖ కార్యాలయంలో మధ్యాహ్నం ఈ కీలక భేటీ జరిగింది. *
ఉద్రిక్తతల వేళ.. ఊపందుకున్న ‘బాయ్కాట్ తుర్కియే’ నినాదం! ఇక, బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. భద్రతాపరంగా
అనుసరించాల్సిన వ్యూహాలు, సైనిక సన్నద్ధతపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులతోనూ ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను కేంద్రం పంచుకోనుంది. మే 19వ
తేదీన పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ శశిథరూర్ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఇందులో విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. ‘సిందూర్’ వివరాలను సభ్యులకు వెల్లడించనున్నారు.