
Flights:: పాక్తో సరిహద్దు ఉన్న నగరాలకు పలు విమానాలు రద్దు
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాకిస్థాన్ ఇంకా దాడులకు యత్నిస్తున్నట్లే కన్పిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో సోమవారం రాత్రి మళ్లీ డ్రోన్లు కనిపించినట్లు కథనాలు
వచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు మరోసారి భయాందోళనకు గురవుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. పాక్తో సరిహద్దు పంచుకుంటున్న నగరాలకు పలు విమాన సర్వీసులను రద్దు
(Flights Cancelled) చేస్తున్నట్లు ఎయిర్ఇండియా, ఇండిగో ప్రకటించాయి. (India Pakistan Tensions) ‘‘తాజా పరిణామాలు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్మూ, లేహ్, జోధ్పుర్, అమృత్సర్,
భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్ నగరాలకు మంగళవారం (మే 13) విమాన రాకపోకలు నిలిపివేస్తున్నాం. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. అప్డేట్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తాం’’ అని ఎయిర్
ఇండియా (Air India) తమ ప్రకటనలో వెల్లడించింది. * భూగర్భ సొరంగాలు.. అణు కార్యక్రమాలు..! @ కిరానా హిల్స్ అటు ఇండిగో కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. ‘‘ప్రయాణికుల భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం.
దీని వల్ల మీ ప్రయాణ ప్రణాళికలకు అంతరాయం ఏర్పడినప్పటికీ రద్దు చేయక తప్పట్లేదు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నాం’’ అని కంపెనీ పేర్కొంది. శ్రీనగర్, లేహ్, రాజ్కోట్,
చండీగఢ్, జమ్మూ, అమృత్సర్ ప్రాంతాలకు ఇండిగో (IngiGo) విమాన సర్వీసులను నిలిపివేసింది. వాస్తవానికి సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కాస్త సద్దుమణిగినట్లు అనిపించడంతో సోమవారం నుంచి
32 ఎయిర్పోర్టులను తిరిగి అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో విమాన సేవలను పునరుద్ధరించేందుకు ఎయిర్లైన్లు కూడా సిద్ధమయ్యాయి. అయితే, జమ్మూకశ్మీర్లోని సాంబా సెక్టార్లో సోమవారం
రాత్రి డ్రోన్ల కదలికలు కన్పించాయి. అటు పంజాబ్లోని జలంధర్లో ఓ నిఘా డ్రోన్ను కూల్చివేసినట్లు సైనిక బలగాలు ప్రకటించాయి. కలవరపడాల్సిందేమీ లేదని, పరిస్థితి పూర్తి నియంత్రణలోనే ఉందని
వెల్లడించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దిల్లీ నుంచి అమృత్సర్కు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని కొంతదూరం వెళ్లాక తిరిగి వెనక్కి మళ్లించారు. అనంతరం విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఇండిగో
ప్రకటించింది. ఎయిర్ఇండియా కూడా ఇదే నిర్ణయాన్ని వెల్లడించింది.