China-pak: భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు చైనా సైనిక సాయం చేసిందా..? స్పందించిన బీజింగ్‌

China-pak: భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌కు చైనా సైనిక సాయం చేసిందా..? స్పందించిన బీజింగ్‌

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-పాక్‌ ఇటీవలి ఉద్రిక్తతల సమయంలో ఇస్లామాబాద్‌కు చైనా సైనిక సహాయం అందించిందా..? మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురుకాగా..  ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి మావోనింగ్ సమాధానం


ఇచ్చారు. ‘‘భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటి నుంచి చైనా తటస్థ వైఖరిని కొనసాగించింది. రెండు దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఇరు దేశాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ


ఒప్పందానికి మద్దతు ఇచ్చాం. శాశ్వత కాల్పుల విరమణను ప్రోత్సహించడంలో, ప్రాంతీయ సుస్థిరత కోసం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాం’’ అని మావోనింగ్ వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌


ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. పీఓకే, పాక్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు తమ వద్ద ఉన్నాయని, భారత వైమానిక, క్షిపణి దాడులను అవి


అడ్డుకుంటాయని కలలుగన్న పాకిస్థాన్‌కు చుక్కెదురైంది. చైనా నుంచి సమీకరించిన హెచ్‌క్యూ-9, ఎల్‌వై-80 వ్యవస్థలు, వాటి రాడార్లు.. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా భారత్‌ ప్రయోగించిన ఒక్క క్షిపణినీ


ఆపలేకపోయాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో భారత క్షిపణులు తక్కువ ఎత్తులో, సూపర్‌సోనిక్‌ వేగంతో దూసుకెళ్లాయి. దీనివల్ల పాక్‌ రాడార్లు వాటిని పసిగట్టలేకపోయాయని భావిస్తున్నారు. ఆ ఆపరేషన్‌ను


జీర్ణించుకోలేని పాకిస్థాన్‌.. చైనాకు చెందిన పీఎల్‌-15, తుర్కియేకు చెందిన YIHA, సొంగార్‌ డ్రోన్లతో మన వైమానిక స్థావరాలను టార్గెట్ చేయాలని ప్రయత్నించి విఫలమైంది. కాగా.. ఈ ఉద్రిక్తతల సమయంలో


పాక్‌కు అనుకూలంగా చైనా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ సంయమనంతో ఉందని, బాధ్యతాయుత విధానాన్ని అవలంబించిందని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్‌ యీ


దాయాదితో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో ఆ దేశానికి అండగా నిలుస్తామని వాంగ్‌యీ పేర్కొన్నారు. ఈ తరుణంలోనే చైనా సహాయం గురించి ఆరోపణలు వచ్చాయి.