
Operation sindoor: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ ఉన్నతాధికారుల పేర్లు ఇవే
Play all audios:

Operation Sindoor: ఉగ్రమూకలకు పాకిస్థాన్ వెన్నుదన్నుగా నిలుస్తుందనే దానికి భారత ఆర్మీ విడుదల చేసిన ఫొటోలే ప్రత్యక్ష నిదర్శనం. ఇంటర్నెట్ డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్, పాక్
ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఇందులో దాదాపు వంద మంది టెర్రరిస్టులు మృతి చెందారు. దీంతో భారత్పై పాక్ ప్రతిదాడులు చేసిన సంగతి తెలిసిందే. వాటిని భారత్
సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇండియన్ ఆర్మీ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది. తొలుత తాము పాల్గొనలేదని
పాక్ బుకాయించినా భారత్ ఫొటోలు విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారుల పేర్లను భారత్ విదేశాంగశాఖ వెల్లడించడం గమనార్హం. ఇందులో
ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. * లెఫ్ట్నెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా, లాహోర్ ఐవీ కార్ప్స్ కమాండర్ * మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్, లాహోర్ 11వ ఇన్ఫ్రాంట్రీ డివిజన్ *
బ్రిగేడియర్ మహ్మద్ ఫర్ఖాన్ షబ్బీర్ * డాక్టర్ ఉస్మాన్ అన్వర్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీస్ * మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్