
Operation sindoor: పాక్పై ఇక ద్వైపాక్షిక ఒత్తిడి.. నేడు పలు దేశాలకు భారత్ స్పెషల్ బ్రీఫింగ్..
Play all audios:

దిల్లీ: ఉగ్ర ముఠాలకు అండగా ఉంటూ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’తో శత్రుదేశాన్ని అన్నివిధాలుగా
దెబ్బతీసిన న్యూదిల్లీ.. ఇప్పుడు దాయాది (Pakistan)పై ద్వైపాక్షికంగా ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే నేడు పలు దేశాల సైనిక రాయబారులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇవ్వనుంది. మన
దేశంలో ఉన్న యూకే సహా పలు దేశాల డిఫెన్స్ అధికారులు, రాయబారులకు కేంద్రం ఇప్పటికే సమన్లు పంపించింది. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు దిల్లీలోని రక్షణశాఖ కార్యాలయంలో కీలక భేటీ నిర్వహించనుంది.
ఇందులో ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించిన ముఖ్య వివరాలను ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకోనుంది. ఉగ్రవాద నిర్మూలనలో భారత్ (India) వేసిన ముందడుగు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాల వివరాలను వారికి
అందించనున్నట్లు సమాచారం. * పాత ఫొటోలు చూపి.. కొత్త కథలు చెప్పిన పాక్ నేవీ..! పాక్పై మిలిటరీ చర్యకు కారణాలు చెప్పి.. మద్దతు కొనసాగించాలని ఆ దేశాలను కేంద్రం కోరనున్నట్లు తెలుస్తోంది. నేటి
మధ్యాహ్నం జరిగే భేటీలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, పలువురు ఉన్నతాధికారులు, రక్షణశాఖ అధికారులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. రేపు కేబినెట్ భేటీ
ఇక, బుధవారం కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. భద్రతాపరంగా అనుసరించాల్సిన వ్యూహాలు, సైనిక సన్నద్ధతపై చర్చించే అవకాశాలున్నట్లు
తెలుస్తోంది. 19న పార్లమెంటరీ కమిటీ సమావేశం మరోవైపు విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులతోనూ ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను కేంద్రం పంచుకోనుంది. మే 19వ తేదీన పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్
శశిథరూర్ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఇందులో విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. ‘సిందూర్’ వివరాలను సభ్యులకు వెల్లడించనున్నారు.