Nirav modi: నీరవ్‌ మోదీకి మరోసారి యూకే కోర్టులో చుక్కెదురు

Nirav modi: నీరవ్‌ మోదీకి మరోసారి యూకే కోర్టులో చుక్కెదురు

Play all audios:


భారతీయ బ్యాంకులను రూ.వేల కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి తాజాగా లండన్‌ కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది.  లండన్‌: భారతీయ బ్యాంకులను రూ.వేల కోట్ల మేర మోసం చేసిన


వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ (Nirav Modi)కి మరోసారి చుక్కెదురైంది. ఆయన బెయిల్‌ పిటిషన్‌ను లండన్‌ హైకోర్టు తాజాగా తిరస్కరించింది. ఆయన బెయిల్‌ విషయంపై కోర్టులో తీవ్ర వాదనలు జరిగాయి. ఆయనకు


బెయిల్‌ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్‌ బలంగా వాదించింది.   నీరవ్‌ మోదీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రుణాలు తీసుకొని రూ.13,500 కోట్ల మేర ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2018లో భారత్‌ నుంచి ఆయన


పరారీ అయ్యాడు. అప్పటి నుంచి భారత దర్యాప్తు సంస్థలు ఆయన కోసం వేట ప్రారంభించాయి. భారత్‌కు అప్పగింతకు సంబంధించి నీరవ్‌కు వ్యతిరేకంగా ఫలితం రావడంతో మార్చి 19, 2019న లండన్‌ అధికారులు అరెస్టు చేసి


జైలులో ఉంచారు. దాదాపు ఆరేళ్లుగా అతడు జైళ్లోనే ఉంటున్నాడు. నీరవ్‌ను స్వదేశానికి తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. 2021లో నీరవ్‌ను భారత్‌కు అప్పగించడానికి అప్పటి


బ్రిటన్‌ హోం మంత్రి ప్రీతి పటేల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అతడు లండన్‌ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ అక్కడి కోర్టు తిరస్కరించింది. ఇప్పటివరకు నీరవ్‌


మోదీ పదిసార్లు కోర్టులో బెయిల్‌ దరఖాస్తు చేశాడు. అన్ని సార్లు ఆయన భంగపాటుకు గురయ్యాడు.