
Operation sindoor: సినిమా అప్పుడే అయిపోలేదు.. ఆర్మీ మాజీ చీఫ్ల కీలక వ్యాఖ్యలు
Play all audios:

ఆపరేషన్ సిందూర్తో ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి చేసిన నేపథ్యంలో ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి
ప్రతీకారంగా.. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే కీలక
వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర స్థావరాలపై దాడిని ఉద్దేశిస్తూ.. ‘సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు మాజీ చీఫ్ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి
(Shankar Roychowdhury) మాట్లాడుతూ.. ఉగ్రస్థావరాలపై భారత బలగాలు చేసిన దాడిని అద్భుతమైన ప్రణాళికతో కూడిన గొప్ప ఆపరేషన్గా ప్రశంసించారు. ఈ దాడులను భారత్ ఆపకూడదని.. కొనసాగించాలని సూచించారు. ఇది
యుద్ధం లాంటి పరిస్థితి కాదని.. ఇప్పటికే ఇరుదేశాల మధ్య అప్రకటిత యుద్ధం కొనసాగుతోందని అన్నారు. దాడుల సమయంలో మాజీ ఆర్మీ చీఫ్ల నుంచి ఈతరహా స్పందన రావడం గమనార్హం. * ఉగ్రవాదుల శిక్షణా శిబిరంపై
విరుచుకుపడిందిలా! వీడియో దృశ్యాలు పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్ పెద్దఎత్తున విరుచుకుపడింది. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర
పన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టి.. ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ విజయవంతంగా నిర్వహించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన
వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ మీడియాకు వెల్లడించింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. ‘న్యాయం జరిగింది’ అని ఎక్స్లో పోస్టు చేసింది. తాజాగా ఈ విషయంపై కేంద్రం
నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విలేకరులతో మాట్లాడారు. కోట్లీలోని గుల్పూర్ టెర్రర్ క్యాంప్పై ఎలా
దాడి చేశామనేది సోఫియా ఖురేషి వీడియో ప్రదర్శించారు. ఇక్కడే గతంలో ‘ఫూంచ్’ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు శిక్షణ తీసుకున్నారంటూ పేర్కొన్నారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో
పోస్ట్ చేశారు.