Maoists: 20 మంది మావోయిస్టుల మృతి.. కుటుంబ సభ్యులకు అప్పగింత

Maoists: 20 మంది మావోయిస్టుల మృతి.. కుటుంబ సభ్యులకు అప్పగింత

Play all audios:


మే 7న జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన 20 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తిస్తున్నారు. 11 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. చర్ల: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని బీజాపూర్‌


జిల్లా ఉసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట కేంద్రంగా గత నెల 22 నుంచి 17 రోజుల పాటు మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భారీ ఆపరేషన్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడి అటవీ ప్రాంతంలో మే 7న


జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన 20 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న భద్రత బలగాలు.. వాటిని బీజాపూర్‌ జిల్లా కేంద్రానికి తరలించారు. మృతదేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ


ముగిసినట్లుగా పోలీసులు సోమవారం వెల్లడించారు. 11 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. మిగిలిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. మావోయిస్టుల దుశ్చర్య


ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లాలోని వేర్వేరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఇన్ఫార్మర్ల నెపంతో ఆదివారం రాత్రి నలుగురు వ్యక్తులను కిరాతకంగా హత్య చేశారు. ఒకే


రోజు జరిగిన ఈ ఘటనతో ఆయా ప్రాంతాల్లోని ఆదివాసీలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ చేపట్టారు.