Shubhanshu shukla: ఐఎస్‌ఎస్‌కు శుభాంశు శుక్లా.. ఆ ప్రత్యేక వాచ్‌ ధరించనున్న భారత వ్యోమగామి

Shubhanshu shukla: ఐఎస్‌ఎస్‌కు శుభాంశు శుక్లా.. ఆ ప్రత్యేక వాచ్‌ ధరించనున్న భారత వ్యోమగామి

Play all audios:


ఇంటర్నెట్‌డెస్క్: భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష కేంద్రం (International Space Station)లో ప్రత్యేకంగా రూపొందిన రెండు వాచ్‌ (Omega watch)లను ధరిస్తారట. మానవసహిత


అంతరిక్షయాత్రలు ప్రారంభమైన తొలిరోజుల నుంచే ఈ వాచ్‌ల సంప్రదాయం మొదలైంది. శుక్లా, ఇతర వ్యోమగాములతో పాటు స్విట్జర్లాండ్‌కు చెందిన ఒమేగా సంస్థ రూపొందించిన చేతి గడియారాలను తీసుకెళ్తామని యాక్సియం


స్పేస్‌ బృందం ధ్రువీకరించింది. వాటిని మరోసారి రోదసియాత్రకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యానించింది. 1965లో చేపట్టిన మానవసహిత అంతరిక్షయాత్రల్లో ఈ గడియారాలను (Omega Speedmaster


watches) వెంట తీసుకెళ్తేందుకు నాసా అనుమతి లభించింది. స్పేస్‌లో ఎలాంటి అసాధారణ పరిస్థితులనైనా ఎదుర్కొనేలా వీటిని రూపొందించారు. అత్యధిక ఉష్ణోగ్రతలు, జీరో గ్రావిటీ, అధిక పీడనం సహా ఎలాంటి


వాతావరణంలో అయినా అవి పనిచేస్తాయి. యాక్సియంలో వెళ్లే వ్యోమగాముల్లో ప్రతి ఒక్కరికి రెండు చొప్పున ఈ వాచ్‌లు అందుతాయి.    యాక్సియం-4 (ఏఎక్స్‌-4) మిషన్‌లో భారత కాలమానం ప్రకారం జూన్‌ 8వ తేదీ


సాయంత్రం 6.41 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9.11 గంటలకు) ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్‌ వ్యోమనౌకలో శుభాంశు (Indian Astronaut Shubhanshu


Shukla) రోదసిలోకి దూసుకెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఇటీవల యాక్సియం స్పేస్‌, నాసా ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. వాస్తవానికి మే 29వ తేదీకే ఈ మిషన్‌ను షెడ్యూల్‌ చేయగా.. కొన్ని సాంకేతిక కారణాల


వల్ల వాయిదా పడింది. దీంతో వచ్చే నెలలో ప్రయోగం చేపట్టనున్నారు. ఈ యాత్రలో శుక్లాతోపాటు పెగ్గీ విట్సన్‌ (అమెరికా), స్లావోస్జ్‌ ఉజ్నాన్స్కీ (పోలండ్‌), టిబర్‌ కపు (హంగరీ) కూడా వెళ్లనున్నారు. వీరు


రెండు వారాల పాటు ఐఎస్‌ఎస్‌లో ఉండి పరిశోధనలు చేయనున్నారు. భారత్‌కు చెందిన ఓ వ్యోమగామి అంతరిక్ష కేంద్రానికి వెళ్తుండటం నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడే. 1984లో మన వ్యోమగామి రాకేశ్‌ శర్మ..


రష్యా వ్యోమనౌకలో అంతరిక్షానికి వెళ్లారు. ఇక, తాజాగా శుభాంశు శుక్లా పాల్గొంటున్న మిషన్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా (NASA), భారత రోదసి పరిశోధన సంస్థ (ISRO)లు సంయుక్తంగా చేపడుతున్నాయి.


రోదసిలో శుభాంశు శుక్లా ఏడు ప్రయోగాల్లో పాల్గొంటారు. అంతరిక్షంలో పంటల సాగు, టార్డిగ్రేడ్‌ (నీటి ఎలుగుబంటి)ల గురించి అధ్యయనం చేయనున్నారు.