Top ten news @ 9 am: ఈనాడు. నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 am (feb 02)

Top ten news @ 9 am: ఈనాడు. నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 am (feb 02)

Play all audios:


1. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల కోసం.. జిల్లాలవారీగా వర్క్‌ స్టేషన్లు కడప: ‘ఇక్కడ ఎవరైనా ఐటీ ఉద్యోగులున్నారా?’ అని ప్రజావేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించగా, 40 మంది మంది యువతీ యువకులు


లేచి నిలబడ్డారు. మీరంతా వేదికపైకి రావాలంటూ ముఖ్యమంత్రి ఆహ్వానించారు. పూర్తి కథనం 2. మెట్రో ప్రాజెక్టులకు భారీ ఇం‘ధనం’ కేంద్ర బడ్జెట్‌లో మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు నిధులు భారీగా కేటాయించడంతో


విజయవాడ, విశాఖలో ప్రతిపాదిత ప్రాజెక్టులపై ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు నగరాల్లోనూ మొదటి దశ పనులకు రూ.11 వేల కోట్ల చొప్పున రూ.22 వేల కోట్ల అంచనాలతో కేంద్ర


ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు పంపింది. పూర్తి కథనం 3. పట్టుపడితే.. గట్టిమేలే! అమరావతి: కేంద్రం ఇది వరకే హామీ ఇచ్చిన పోలవరం, విశాఖ ఉక్కు మినహా.. ఈ బడ్జెట్‌లో నేరుగా ఆంధ్రప్రదేశ్‌కు


భారీ కేటాయింపులేమీ చూపించలేదు. అలాగని రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని కాదు.పూర్తి కథనం 4. మనమూ ‘ఉడాన్‌’లో విహరించొచ్చు! అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రాంతాలను అనుసంధానించేందుకు కొత్త విమాన


సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉంది. ఉడాన్‌ పథకం కింద అదనంగా 120 మార్గాల్లో విమాన సేవలు అందుబాటులోకి తేవాలని కేంద్రం ప్రతిపాదించింది.పూర్తి కథనం 5. మెట్రో రెండో దశ.. నిరాశ


హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా మెట్రో రైలు ప్రాజెక్టులను పరుగు తీయించడమే లక్ష్యంగా పద్దులో రూ.31వేల కోట్ల కేటాయింపులు జరిగాయి. అందులో హైదరాబాద్‌లో చేపట్టదలచిన రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టును


చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్రాన్ని ఆశ్రయించింది.పూర్తి కథనం 6. పాతవి రావు.. కొత్తవీ లేవు హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపింది.


రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క పథకానికి గానీ, ప్రాజెక్టుకు గానీ బడ్జెట్‌లో చోటు దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలిచ్చినా, ఫలితం కనిపించలేదు.పూర్తి కథనం 7. కేంద్ర


పన్నుల్లో రాష్ట్ర వాటా పెరగలేదు హైదరాబాద్‌: కేంద్ర పన్నుల్లో తెలంగాణ రాష్ట్ర వాటాగా వచ్చే ఆదాయం శాతం ఏ మాత్రం పెరగలేదు. జాతీయస్థాయిలో వచ్చిన మొత్తం సొమ్మును రాష్ట్రాలకు పంపకాల శాతాలను బట్టి


చూస్తే ...తెలంగాణ 2.1 శాతంతో 15వ స్థానంలో ఉంది.పూర్తి కథనం 8. ఈవీల విక్రయాలు పెరిగేనా..! హైదరాబాద్‌: కాలుష్యరహిత వాహనాల వినియోగం భవిష్యత్తులో మరింత పెరగనుంది. ఎలక్ట్రిక్‌ వాహనా(ఈవీ)ల్లో


బ్యాటరీలు కీలకం. వాటి తయారీకి అవసరమైన ముడిసరకుల్లో చాలావరకు విదేశాల నుంచే దిగుమతవుతున్నాయి.పూర్తి కథనం 9. 192% పెరిగిన అప్పు.. పదేళ్లలో రూ.62 లక్షల కోట్ల నుంచి రూ.181 లక్షల కోట్లకు.. దిల్లీ:


దేశంపై అప్పుల భారం 2026 మార్చి 31 నాటికి  రూ.196,78,772.62 కోట్లకు చేరుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనావేసింది. ఇందులో రూ.190,14,852 కోట్లు దేశీయ, రూ.6,63,920 కోట్లు విదేశీ రుణం.పూర్తి కథనం


10. ఎన్‌పీఎస్‌ వాత్సల్య మరింత ఆకర్షణీయం దిల్లీ: గత ఏడాది (2024) సెప్టెంబరు 18న ప్రారంభించిన ఎన్‌పీఎస్‌-వాత్సల్య పథకం ద్వారా పన్ను మినహాయింపు పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా


కల్పించింది.పూర్తి కథనం