
Bomb threats: బాంబు పేలుళ్లపై ముంబయి పోలీసులకు మెయిల్
Play all audios:

ఇంటర్నెట్డెస్క్: రానున్న రెండు రోజుల్లో బాంబు పేలుళ్లు జరుగుతాయని కొందరు అగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ముంబయి పోలీసులకు ఇ-మెయిల్ పంపించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్కు మంగళవారం ఒక ఇ-మెయిల్ వచ్చింది. అందులో రానున్న రెండు రోజుల్లో బాంబు పేలుళ్లు (Bomb threats) జరుగుతాయని నిందితులు
హెచ్చరించారు. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ మెయిల్ను ఎవరు పంపించారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. ఇటీవల భారత్- పాక్ల మధ్య
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో అనేక ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే, అవన్నీ బూటకమని అధికారులు తేల్చారు. ప్రస్తుతం భారత్- పాక్ల మధ్య కాల్పుల విరమణ
కొనసాగుతోంది. ఈక్రమంలో బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది.