
Krishnam raju: తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: సీఎం కేసీఆర్
Play all audios:

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం.. హైదరాబాద్: ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. తన
యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో కృష్ణంరాజు కథానాయకుడిగా నటించి విలక్షణ నటనాశైలితో రెబల్స్టార్గా పేరు తెచ్చుకున్నారని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని
లోటు అని చెప్పారు. లోక్సభ సభ్యునిగా, కేంద్రమంత్రిగానూ సేవలందించిన కృష్ణంరాజు మృతి విచారకరమన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరని కేసీఆర్
ఆకాంక్షించారు.