
Murder case: స్క్రూ డ్రైవర్తో 18సార్లు పొడిచి మహిళపై దారుణం.. హంతకుడిని పట్టించిన ‘మిస్డ్కాల్స్’
Play all audios:

మొరాదాబాద్: శనివారం పశువులకు మేత తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళ శవమై తేలింది. కుటుంబ సభ్యులు గాలించగా మరుసటి రోజు పంట పొలాల్లో రక్తపు మడుగులో కనిపించింది. ప్రేమిస్తున్నానంటూ
వెంటపడిన వ్యక్తే సైరా అనే మహిళను స్క్రూడ్రైవర్తో 18 సార్లు పొడిచి.. చిత్రహింసలకు గురిచేసి దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్ప్రదేశ్ మొరాదాబాద్లోని కొట్వాలి మైనథర్ గ్రామంలో
వెలుగుచూసింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహిళ రహస్య భాగాలపై గాయాలు ఉండటంతో అత్యాచారం జరిగి ఉంటుందని తాము అనుమానించినప్పటికీ.. శవపరీక్షలో మాత్రం అలాంటిదేమీ జరగలేదని
తేలినట్లు పోలీసులు వెల్లడించారు. సైరా మొబైల్ ఫోన్లో ఐదు మిస్డ్ కాల్స్ని గుర్తించి.. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన రఫీ అనే వ్యక్తిని అదుపులోకి
తీసుకున్నారు. అయితే, ఈ యువకుడు తన కుమార్తెను వేధించేవాడని సైరా తల్లి సఫీనా పోలీసులకు చెప్పడంతో అతడిని కస్టడీలోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. తానే సైరాను హత్య చేసినట్లు రఫీ
అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి ‘‘సైరాను ప్రేమిస్తున్నట్లు రఫీ చెప్పినా ఆమె అతడిని దూరం పెట్టింది. కొన్ని రోజుల క్రితం రఫీని మరో
వ్యక్తి కొట్టాడు. దీంతో తనను కొట్టిన వ్యక్తితో సైరా రిలేషన్షిప్లో ఉన్నట్టు అనుమానించిన రఫీ.. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆమె వెంటపడ్డాడు. ఈ క్రమంలోనే శనివారం సైరాను అనుసరించి పొలంలోకి వెళ్లి
స్క్రూడ్రైవర్తో 18 సార్లు ఆమెపై దాడి చేశాడు. నొప్పితో ఆమె విలవిలలాడుతూ ప్రాణాల కోసం ప్రాధేయపడినా వదల్లేదు. ఆమె ప్రాణాలు విడిచిన తర్వాత నిందితుడు ఇంటికి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని
నిద్రపోయాడు’’ అని పోలీసులు వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.