Operation sindoor: భారత్‌ దాడి చేస్తే పాక్‌ కలుగులో దాక్కోవాల్సిందే: ఎయిర్‌ డిఫెన్స్‌ డీజీ

Operation sindoor: భారత్‌ దాడి చేస్తే పాక్‌ కలుగులో దాక్కోవాల్సిందే: ఎయిర్‌ డిఫెన్స్‌ డీజీ

Play all audios:


Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదని ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ ఎద్దేవా చేశారు. దిల్లీ: ‘ఆపరేషన్‌ సిందూర్‌’కు ప్రతిగా పాకిస్థాన్‌


పాల్పడిన దుస్సాహసాన్ని భారత్‌ గట్టిగా తిప్పికొట్టింది. శత్రు దేశ డ్రోన్లు, క్షిపణులను కూల్చేయడంతో పాటు వారి కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, భారత్‌ తలుచుకుంటే పాక్‌ మొత్తంపై దాడి


చేసే సామర్థ్యం మనకు ఉందన్నారు ఆర్మీ (Indian Army) ఎయిర్‌ డిఫెన్స్‌ డీజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ సుమేర్‌ ఇవాన్‌ డి కున్యా. అదే జరిగితే దాయాది (Pakistan) ఏదైనా కలుగు వెతుక్కుని అందులో


దాక్కోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దాయాదిపై విమర్శలు గుప్పించారు. ‘‘పాకిస్థాన్‌పై పూర్తి స్థాయిలో దాడి చేసేందుకు భారత్‌ వద్ద సరిపడా ఆయుధ సామర్థ్యం


ఉంది. పాక్లోని ప్రతి ప్రదేశం మన రేంజ్‌లోనే ఉంది. మన సరిహద్దుల నుంచే ఆ దేశంలోని అన్ని ప్రాంతాలపై దాడి చేయగలం. ఒకవేళ వాళ్లు తమ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ను రావల్పిండి నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వా


లాంటి ప్రాంతాలకు తరలించినా.. అక్కడ కూడా దాడులు చేసేవాళ్లమే. అప్పుడు వారు ఏదైనా కలుగు వెతుక్కుని అందులో దాక్కోవాల్సి వచ్చేది’’ అని సుమేర్‌ విమర్శించారు. * జమ్ముకశ్మీర్‌ సమస్యలపై మాట్లాడే


అర్హత ఏ ఇతర దేశానికీ లేదు: విదేశాంగ శాఖ ఈ ఆపరేషన్‌ సిందూర్‌లో అధునాతన స్వదేశీ సాంకేతికత, దీర్ఘ శ్రేణి డ్రోన్లు, గైడెడ్‌ మిస్సైళ్లు కీలక పాత్ర పోషించినట్లు ఆయన తెలిపారు. ‘‘మన సార్వభౌమత్వాన్ని


రక్షించడమే సైన్యం కర్తవ్యం. సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకోవడంతో పాటు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడటమే మా ప్రథమ ప్రాధాన్యం. దానికి అనుగుణంగానే మేం ఆపరేషన్‌ చేపట్టాం. ఈ రోజు మనం సాధించిన


విజయంతో కేవలం సైనికులే కాదు.. వారి కుటుంబాలు, యావత్ భారతావని గర్వపడుతోంది’’ అని సుమేర్ ఆనందం వ్యక్తం చేశారు.