
Ipl 2025: అందులో గెలిచినా.. పంజాబ్ చేతిలో ముంబయి - దిల్లీ ‘నాకౌట్’ భవితవ్యం
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్ (IPL 2025) ప్లేఆఫ్స్కు మూడు జట్లు దూసుకుపోయాయి. ఇక నాలుగో టీమ్ ఏదనేది తేలాల్సి ఉంది. తాజాగా గుజరాత్ చేతిలో ఓటమితో దిల్లీ ప్లే ఆఫ్స్ అవకాశాలు
సంక్లిష్టంగా మారాయి. నాలుగో స్థానం కోసం ముంబయి ఇండియన్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ కూడా రేసులో ఉన్నాయి. మరి నాలుగో బెర్తు ఎవరికి దక్కనుందనేది ఆసక్తికకరంగా మారింది. ఎవరి అవకాశాలు ఎలా
ఉన్నాయనే దానిపై ఓ లుక్కేద్దాం.. ముంబయి ఇలా.. దిల్లీ క్యాపిటల్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్తో పోలిస్తే ముంబయి ఇండియన్స్కు కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ జట్టు 12 మ్యాచ్ల్లో 14
పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అయితే, మే 21న జరగనున్న మ్యాచ్లో దిల్లీని ఓడిస్తే మాత్రం నాకౌట్కు చేరుకోవడం దాదాపు ఖాయమవుతుంది. ఆ తర్వాత పంజాబ్తో మే 26న ముంబయి తలపడనుంది. ఇందులోనూ
గెలిస్తే టాప్ -2లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా జరగాలంటే గుజరాత్, ఆర్సీబీ తమ చివరి రెండు మ్యాచుల్లోనూ ఓడాలి. దిల్లీ ఛాన్స్ ఎలాగంటే? గుజరాత్ చేతిలో ఘోర ఓటమితో దిల్లీ క్యాపిటల్స్ తన
అవకాశాలను చాలా ఇబ్బందికరంగా మార్చుకుంది. ప్రస్తుతం దిల్లీ 12 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. అయినా, ఆ జట్టుకు ఓ ఛాన్స్ ఉంది. అలా జరగాలంటే తొలుత ముంబయి (మే 21న)పై
గెలవాలి. ఒకవేళ ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం ఇంటిముఖం పట్టినట్టే. ముంబయిపై విజయం సాధించినా ప్లేఆఫ్స్కు చేరుకుంటామనే భరోసా దిల్లీకి లేదు. ఎందుకంటే చివరి మ్యాచ్లో పంజాబ్ను కూడా దిల్లీ ఓడించాలి.
అదే సమయంలో తన చివరి లీగ్ మ్యాచ్లో పంజాబ్పై ముంబయి చిత్తు అయితేనే దిల్లీకి ఛాన్స్ దక్కనుంది. అంటే ముంబయి - దిల్లీ జట్ల నాకౌట్ భవితవ్యం పంజాబ్ చేతిలో ఉండనుంది. లఖ్నవూకు కష్టమే కానీ.. పై
రెండు జట్లతో పోలిస్తే లఖ్నవూ సూపర్ జెయింట్స్కు ఛాన్స్లు తక్కువే. ప్రస్తుతం లఖ్నవూ 11 మ్యాచ్ల్లో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. సోమవారం హైదరాబాద్తో పోరులో ఓడిపోతే మాత్రం లఖ్నవూ ఇంటి
ముఖం పట్టినట్టే. గెలిస్తే రేసులో నిలుస్తుంది. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (మే 24), గుజరాత్ టైటాన్స్తో (మే 27) మ్యాచుల్లోనూ మంచి నెట్రన్రేట్తో విజయం సాధించాలి. అప్పుడే లఖ్నవూకు 16
పాయింట్లతో నాకౌట్ బెర్తు దక్కనుంది. ఇప్పుడున్న ఫామ్తో లఖ్నవూ సాధించడం కష్టమే కానీ.. క్రికెట్లో ఏదైనా సాధ్యమేనని ఇప్పటికే పలుమార్లు నిరూపితమైన సంగతి తెలిసిందే.