
Operation sindoor: భారత్ గతంలో ఎన్నడూ చేయనట్లు.. ‘ఆపరేషన్ సిందూర్’
Play all audios:

Operation Sindoor | ఇంటర్నెట్డెస్క్: భారత్ గతంలో జరిపిన మెరుపుదాడుల కంటే తాజాగా నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పూర్తిగా భిన్నమైనది. 2016లో ఉరి ఉదంతం తరువాత
నిర్వహించిన మెరుపుదాడులు, 2019లో బాలాకోట్ ఎయిర్స్ట్రైక్స్ సహా గతంలో ఎన్నడూ ఇటువంటి దాడులు చేపట్టలేదు. సాంకేతికపరంగా ఈ ఆపరేషన్ అత్యంత బలమైనది.. ఖర్చుతో కూడుకొన్నది. అంతేకాదు.. ఉగ్రవాదం
విషయంలో గతంలో అనుసరించిన వైఖరి పూర్తిగా మారిపోయిందనే బలమైన సంకేతం పాక్కు వెళ్లింది. ‘‘భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చడంతో.. టెర్రరిస్ట్ నెట్వర్క్లు, వాటి హ్యాండ్లర్లకు తీవ్ర హెచ్చరికలు
వెళ్లినట్లైంది. దీంతోపాటు భారత్ అవసరమైతే ముందస్తుగా దాడి చేయగలదని.. పాక్లోని ఏ లక్ష్యం తమకు దూరం కాదని చెప్పినట్లైంది. దీంతోపాటు ఉగ్రదాడులకు ప్రతిస్పందించడమంటే కేవలం శక్తినే చూపబోమని..
టెర్రరిస్టుల కార్యకలాపాలు, ఇతర వనరుల పునాదులను పెకలించేస్తామని ఈ దాడులతో పేర్కొంది. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే 24 ఆయుధాలను భారత్ వినియోగించింది. వీటిల్లో క్షిపణులు, బాంబులు,
ఆత్మాహుతి డ్రోన్లు ఉన్నాయి. మొత్తం తొమ్మిది ఉగ్రక్యాంప్లను ఏకకాలంలో ధ్వంసం చేశాయి. దాదాపు 70 మందికిపైగా ఉగ్రవాదులు మరణించారు. మరో 60 మంది వరకు గాయపడ్డారు. ఈ దాడి కోసం భారత్ ఇంటెలిజెన్స్
అధికారులు ఉపగ్రహ చిత్రాలను, హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఉగ్ర కమ్యూనికేషన్లను విశ్లేషించి.. జైషే మహమ్మద్, లష్కరే వినియోగించే కాంప్లెక్స్ను గుర్తించారు. వీటితోపాటు ఆ ఉగ్ర సంస్థల ఆయుధ డిపోలను,
బ్రెయిన్ వాషింగ్, స్లీపర్ సెల్ ప్లానింగ్ కేంద్రాలను నిర్ధరించుకొన్నారు. ఇక సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న స్థావరాలపై మానవ రహిత విమానాలతో కొన్ని రోజులుగా నిఘా ఉంచారు. ఆయుధాల ఎంపికలో
కూడా అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలు ఛేదించేవాటినే ఎంచుకొన్నారు. స్కాల్ప్ క్రూజ్ మిసైల్, హ్యామర్ గైడెడ్ బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లను ఎంచుకొన్నారు. దాదాపు 25 నిమిషాలపాటు జరిగిన ఈ
ఆపరేషన్లో అంతర్జాతీయ సరిహద్దులకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలోని బవహల్పూర్ జైషే క్యాంప్ సహా పలు స్థావరాలను నేల మట్టం చేసింది. ఇక్కడ పాక్ ఆర్మీ రెజిమెంటల్ సెంటర్ కూడా ఉంది. పాకిస్థాన్లో
అత్యంత శక్తిమంతమైన పంజాబ్ ప్రావిన్స్లోనే నాలుగు టెర్రర్ క్యాంప్లను నేలమట్టం చేశారు.