
Jyoti malhotra: వారు పాక్ ‘ఐఎస్ఐ’ సిబ్బంది అని తెలిసినా జ్యోతి టచ్లోనే.. కానీ: పోలీసులు
Play all audios:

హిస్సార్: పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Youtuber Jyoti Malhotra)పై దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె పూర్తి స్పృహతోనే పాకిస్థానీ ఇంటెలిజెన్స్
అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందని హరియాణా పోలీసులు వెల్లడించారు. అయితే, ఉగ్రవాదులతో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. అంతేగాక, సాయుధ దళాల గురించి కూడా ఆమెకు
అవగాహన లేదని హిస్సార్ ఎస్పీ వెల్లడించారు. ‘‘ఉగ్ర ముఠాలతో గానీ, ఉగ్రవాదులతో గానీ ఆమెకు సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలను మేం గుర్తించలేదు. ఉగ్ర కార్యకలాపాల్లోనే ఆమె
పాలుపంచుకున్నట్లు సాక్ష్యాల్లేవు. ఇక, పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు గానీ, మతం మార్చుకోవాలని అనుకున్నట్లు గానీ నిర్ధరించే పత్రాలేవీ మాకు దొరకలేదు. అయితే, ఆమె
మాట్లాడుతున్న వారిలో పాక్ గూఢచర్య సంస్థకు చెందిన వారు ఉన్నారని తెలిసినప్పటికీ.. జ్యోతి వారితో సంప్రదింపులు కొనసాగించారు. ఇక, మన సాయుధ దళాల ప్రణాళికల గురించి ఆమెకు అవగాహన ఉన్నట్లు అన్పించడం
లేదు’’ అని హిస్సార్ ఎస్పీ పేర్కొన్నారు. * పాక్లో.. అప్పట్లో అయూబ్ ఖాన్.. ఇప్పుడు మునీర్.. ఒక్కటే తేడా! ఇక, జ్యోతి డైరీ గురించి మీడియాలో వస్తున్న కథనాలపైనా ఎస్పీ స్పందించారు. ‘‘పాక్
గూఢచారులతో ఆమెకున్న సంబంధాలకు సంబంధించిన కేసులో ఆమెను రిమాండ్లోకి తీసుకున్నాం. ఇదే సమయంలో కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను విచారించాయి. అయితే, ఏ ఇతర కస్టడీకి జ్యోతిని అప్పగించలేదు.
మరోవైపు, ఆమె డైరీలోని కొన్ని పేజీలంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాంటివేవీ మేం స్వాధీనం చేసుకోలేదు. మా దగ్గర ఎలాంటి డైరీ లేదు. ఆమెకు చెందిన మూడు మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్,
ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే స్వాధీనం చేసుకున్నాం. వాటిని పరిశీలన కోసం ల్యాబ్కు పంపించాం’’ అని హిస్సార్ ఎస్పీ వెల్లడించారు. ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్
విత్ జో (Travel With Jo) పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. 2023లో పాక్కు వెళ్లిన సమయంలో ఆమెకు పాక్ హైకమిషన్ ఉద్యోగి అయిన డానిష్తో పరిచయమైంది. అనంతరం ఆమె ఆ దేశ గూఢచర్య సంస్థ
ప్రతినిధులతో టచ్లోకి వెళ్లినట్లు తెలిసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ జ్యోతి.. డానిష్తో మాట్లాడినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్
బ్యూరో అధికారులు కూడా ఆమెను ప్రశ్నించారు. మరోవైపు, ఆమె పోలీసు కస్టడీని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది.